యాప్నగరం

ఉద్యోగులకు మారుతి సుజుకీ పండుగ ఆఫర్

Leave Travel Concession: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మారుతి సుజుకీ కంపెనీ పండుగ ఆఫర్ ప్రకటించింది. వివిధ మోడళ్ల కార్లపై డిస్కౌంట్లు ప్రకటించింది.

Samayam Telugu 18 Oct 2020, 6:51 pm
దేశీయ కార్ల తయారీ దిగ్గజం ‘మారుతి సుజుకీ’ ప్రభుత్వ ఉద్యోగుల కోసం సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఈ పండగ సీజన్‌లో మారుతీ కార్ల కొనుగోలుపై రూ.11,000 వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వివిధ శాఖలు, సంస్థల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు పోలీసు, పారామిలటరీ సిబ్బందికి ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఎల్‌టీసీ ఎన్‌క్యాష్‌మెంట్‌ బెన్‌ఫిట్‌కు అదనంగా ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
Samayam Telugu మారుతీ సుజుకీ
Maruti Suzuki festival offers for Govt Employees


ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే లక్ష్యంగా తమ వంతు బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మారుతీ సుజుకీ సంస్థ తెలిపింది. కొత్త కారు కొనేటప్పుడు ఈ ప్రయోజనాలను అందిస్తామని పేర్కొంది. ఆల్టో, సెలేరియో, ఎస్‌-ప్రెస్సో, వ్యాగన్‌-ఆర్‌, ఈకో, స్విఫ్ట్‌, స్విఫ్ట్ డిజైర్‌, ఇగ్నిస్‌, బాలెనో, విటారా బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్‌ఎల్‌6, సియాజ్‌, ఎస్‌-క్రాస్‌ లాంటి మోడళ్ల కొనుగోలుపై ఈ స్కీమ్‌ వర్తిస్తుందని తెలిపింది. మోడళ్లను బట్టి డిస్కౌంట్లలో తేడాలు ఉంటాయని తెలిపింది.

‘ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ పెంచేందుకు ప్రభుత్వం ఇటీవల కొన్ని చర్యలు చేపట్టింది. తమ వంతు బాధ్యతగా ఈ పండుగ ఆఫర్‌ను అందిస్తున్నాం’ అని Maruti Suzuki కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (మార్కెట్‌ అండ్‌ సేల్స్‌) శశాంక్‌ శ్రీవాస్తవ అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వివిధ శాఖలు, సంస్థల్లో సుమారు కోటి మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది మాకు నమ్మకమైన వినియోగదారులుగా ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని ఈ స్పెషల్‌ ఆఫర్ ప్రకటిస్తున్నాం. దీని ద్వారా వారు తమకు ఇష్టమైన కార్లను ఇంటికి తీసుకెళ్లవచ్చు’ అని శశాంక్ పేర్కొన్నారు.

కేంద్రం ఇటీవల ప్రకటించిన ఎల్‌టీసీ (Leave Travel Concession) క్యాష్‌ వోచర్‌ స్కీమ్‌‌తో సుమారు 45 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందుతారని మారుతి సుజుకీ అభిప్రాయపడింది. దీనికి అదనంగా తాము ప్రకటించిన ఆఫర్‌తో 2021 మార్చి 31 నాటికి అదనంగా రూ.28,000 కోట్ల మేర డిమాండ్‌ ఏర్పడే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేసింది.

Must Read: భారతీయుల ఆయుష్షు బాగా పెరిగింది.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Also Read: మూసీకి ఎన్నడూ లేనంత వరద.. డ్యామ్‌కు ప్రమాదం ఉందా?

Watch: భూగర్భంలో ఉగ్రవాదుల రహస్య స్థావరం..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.