యాప్నగరం

బయటపడుతున్న గుట్టల కొద్దీ కొత్తనోట్లు

బుధవారం ఉదయం ఐటీ అధికారులు, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో రూ.కోట్లు బయటపడ్డాయి.

Samayam Telugu 14 Dec 2016, 11:48 am
బుధవారం ఉదయం ఐటీ అధికారులు, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో రూ.కోట్లు బయటపడ్డాయి. బెంగళూరు. పంజీమ్, ఫరిదాబాద్ లలో ఐటీ అధికారులు నిర్వహించిన దాడుల్లో రూ.3.25కోట్లు పట్టుబడ్డాయి. తనిఖీల్లో పట్టుబడ్డ నగదు మొత్తం కొత్తగా విడుదలైన రూ.2వేల నోట్లలోనే ఉంది.
Samayam Telugu massive it raids new currency seized in bengalore panjim and faridabad
బయటపడుతున్న గుట్టల కొద్దీ కొత్తనోట్లు


అటు ఢిల్లీలోని కరోల్ బాగ్ లోని ఓ హోటల్ లో అధికారులు దాడులు నిర్వహించగా...రూ.3.25కోట్లు రద్దయిన పాతనోట్లు పట్టుబడ్డాయ. ఈ మొత్తాన్ని డిల్లీని నుంచి ముంబైకి తరలించేందుకు ఐదుగురు యువకులు సిద్ధమవ్వగా పోలీసులు అరెస్టు చేశారు.

బెంగళూరులో రూ.2.25 కోట్లు, పంజీమ్ లో రూ.68లక్షలు, రూ.ఫరిదాబాద్ లో రూ.25లక్షలు కొత్త నోట్లు పట్టుబడ్డాయి.

ఒకవైపు కేవలం రూ.2వేలు విత్ డ్రా చేసుకోవడానికి సామాన్యులు అష్టకష్టాలు పడుతుంటే...బడాబాబులు, నల్లకుబేరులు, బ్యాంకు అధికారులు కుమ్మక్కై ఆర్బీఐ నుంచి బ్యాంకులకు చేరేలోపే అవి అక్రమ మార్గం పడుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.