యాప్నగరం

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10మంది మృతి

దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా వెంటాడిన మృత్యువు.. ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన 9మంది మృతి.

Samayam Telugu 14 Oct 2018, 1:22 pm
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజనంద్‌గావ్ జిల్లాలో జాతీయ రహదారి 53పై కారు ట్రక్కును ఢీకొట్టడంతో 10 చనిపోయారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గర్ని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో 9మంది ఒకే కుటుంబానికి చెందినవారు కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. దసరా శరన్నవరాత్రులు కావడంతో దోంగర్‌గఢ్ ప్రాంతంలో ఉన్న బమ్లేశ్వరి ఆలయానికి భక్తులు వస్తుంటారు. అలా అమ్మవారిని దర్శించుకున్న ఒకే కుటుంబానికి చెందినవారు కారులో తమ సొంత ఊరు బిలాయ్‌కు బయల్దేరారు.
Samayam Telugu Accident


కారు సరిగ్గా రాజనంద్ గావ్-దుర్గ్ ప్రాంతానికి రాగానే వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోగా.. ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జు, నుజ్జుకాగా.. 9మంది అక్కడికక్కడే చనిపోయారు.. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గుర్ని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన 9మంది చనిపోవడంతో విషాదచాయలు అలముకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.