యాప్నగరం

బెహన్‌జీ రూ.50కోట్లు డిమాండ్ చేశారు:సిద్దిఖీ

బీఎస్పీ అధినేత్రి మాయావతిపై అవినీతి ఆరోపణలు చేశారు ఆ పార్టీ బహిష్కృత నేత నసీముద్దీన్ సిద్ధిఖీ

TNN 11 May 2017, 8:50 pm
బీఎస్పీ అధినేత్రి మాయావతిపై అవినీతి ఆరోపణలు చేశారు ఆ పార్టీ బహిష్కృత నేత నసీముద్దీన్ సిద్ధిఖీ. తనను రూ.50కోట్లు ఇవ్వాలని బెహన్ జీ డిమాండ్ చేశారని ఆయన గురువారం ఆరోపించారు.
Samayam Telugu maywati asked me rs 50 cr alleges expelled naseemuddin
బెహన్‌జీ రూ.50కోట్లు డిమాండ్ చేశారు:సిద్దిఖీ


మొన్న జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఓడిపోవడంతో ఆమె ముస్లింలపై అనుచిత వ్యాఖ్యాలు చేశారని సిద్ధిఖీ అన్నారు. బీఎస్పీ ఓడిపోవడానికి ముస్లింలు ఓటు వేయకపోవడమేనని మాయావతి దుర్భషలాడారని ఆరోపించారు.

మాయావతి తనను డబ్బులు అడగడం, ఇతర అవినీతి కార్యకలపాలకు పాల్పడటంపై తన వద్ద ఆధారాలున్నాయని చెప్పిన సిద్ధిఖీ.. మాయావతి తనతో మాట్లాడిన ఆడియో టేపులున్నాయని అన్నారు. తన దగ్గర మాయావతి టెలిఫోన్ సంభాషణలు 50పైకి పైగా ఉన్నాయన్నారు.

ఆమె అంబేద్కర్, కాన్షీరాం సిద్ధాంతాలకు ఎప్పుడో తిలోదకాలిచ్చారని మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.