యాప్నగరం

ఢిల్లీ ప్రజలకు థాంక్స్ చెప్పిన ప్రధాని మోదీ

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్షం

TNN 26 Apr 2017, 7:42 pm
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. నార్త్, ఈస్ట్, సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లలో బుధవారం వెల్లడైన ఫలితాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది.
Samayam Telugu mcd election modi says grateful to the people of delhi for the faith in bjp
ఢిల్లీ ప్రజలకు థాంక్స్ చెప్పిన ప్రధాని మోదీ


బీజేపీ పట్ల విశ్వాముంచి విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. విజయం కోసం అమర్నిషలు కృషి చేసిన ఢిల్లీ బీజేపీ టీమ్ కు ఆయన అభినందనలు తెలిపారు.

Grateful to the people of Delhi for the faith in BJP. I laud the hardwork of team @BJP4Delhi which made the resounding MCD win possible.— Narendra Modi (@narendramodi) April 26, 2017
కడపటి వార్తలు అందే సమయానికి మూడు కార్పొరేషన్లలో బీజేపీ ఖాతాలో 160 సీట్లు పడ్డాయి. ఇంకా 35 స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో ఢిల్లీ అధికార పార్టీ ఆమ్ ఆద్మీకి 39 స్థానాలు దక్కగా.. కాంగ్రెస్ పార్టీ 26 సీట్లతో సరిపెట్టుకుంది.

మూడు స్థానాలను బీజేపీ హస్తగతం చేసుకోవడాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ‘ఇది మాకు ఊహించని విజయం. ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు. మోదీ నాయకత్వం వల్లే తమకీ విజయం’ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.