యాప్నగరం

#MeToo: ఆ ఆరోపణలు అవాస్తవం.. మంత్రి ఎంజే అక్బర్

తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ ఖండించారు. అయితే, కేంద్రం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోనుందో చూడాలి.

Samayam Telugu 14 Oct 2018, 5:57 pm
తాను లైంగిక వేధింపులకు పాల్పడ్డానంటూ #MeTooలో వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని, వీటిపై తాను న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ తెలిపారు. విదేశీ పర్యటనలో ఉన్న అక్బర్ ఆదివారం ఢిల్లీకి వచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై ప్రకటన విడుదల చేశారు.
Samayam Telugu Untitled12


‘‘ఎన్నికలకు ముందే ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? నాపై అసూయతో, నా ప్రతిష్ఠకు భంగం కల్గించేందుకే ఇలాంటివి సృష్టిస్తున్నారు. నేను విదేశీ పర్యటనలో ఉండటంతో ఈ ఆరోపణలపై స్పందించలేదు. ఈ ఆరోపణలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను. ఎలాంటి ఆధారం లేని ఆరోణలు వైరల్‌గా ప్రచారమవుతున్నాయి. నాకు ఈత కొట్టమే రాదు. కానీ, నేను స్విమ్మింగ్ పూల్‌లో పార్టీలు చేసుకుంటానని చెబుతున్నారు. ఈ తప్పుడు ఆరోపణలపై ఏం చేయాలనేది నా లాయర్లు నిర్ణయిస్తారు’’ అని తెలిపారు. ఆయన ప్రకటన చూస్తుంటే.. తన పదవికి రాజీనామా చేయరనే తెలుస్తోంది.

దీనిపై ఆయన విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో కూడా చర్చించనున్నట్లు తెలిసింది. టెలిగ్రాఫ్‌, ఏసియన్‌ ఏజ్‌ పత్రికల ఎడిటర్‌గా ఉన్నపుడు అక్బర్‌ పలువురు మహిళా జర్నలిస్టులను లైంగికంగా వేధించారని, కొందరిపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. ఆయన విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన నేపథ్యంలో ఆయన రాజీనామాకు బీజేపీ పెద్దలు ఒత్తిడి చేసే అవకాశాలున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.