యాప్నగరం

కాంగ్రెస్‌కు #మీటూ సెగ.. ఎన్‌ఎస్‌యూఐ ప్రెసిడెంట్ రాజీనామా

మీటూ వివాదంలో కాంగ్రెస్ కూడా ఇరుక్కుంది. ఆ పార్టీ విద్యార్థి విభాగం నేత తనను లైంగికంగా వేధించారంటూ ఓ మహిళా కార్యకర్త ఆరోపణలు చేసింది.

Samayam Telugu 17 Oct 2018, 12:40 am
కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో ఇరుక్కుంది. ఆ పార్టీ విద్యార్థి విభాగం జాతీయ అధ్యక్షుడు, జమ్ము కశ్మీర్‌కు చెందిన నేత ఫిరోజ్‌ ఖాన్‌‌పై మీటూలో భాగంగా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ అంశం వెలుగులోకి వచ్చిన వెంటనే పలువురు నేతలు కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు.
Samayam Telugu khan

మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యమం ధాటికి సినీ, రాజకీయ, మీడియా, కార్పొరేట్ రంగాలు కుదేలవుతున్నాయి. ఎప్పుడు ఎవరిపై ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి.

ఫిరోజ్ ఖాన్ తనను లైంగికంగా వేధించాడంటూ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కాంగ్రెస్‌ మహిళా కార్యకర్త ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్ష పదవికి ఫిరోజ్‌ రాజీనామా చేశారు. అతడి నిర్ణయాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వెంటనే ఆమోదించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు మీడియాకు వెల్లడించాయి.

కాంగ్రెస్ కార్యకర్త ఆరోపణల్లో వాస్తవాలను నిర్ధారించడానికి ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సదరు మహిళ ఫిరోజ్‌ మీద పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనకు ప్రాణహాని ఉందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఫిరోజ్‌పై సదరు మహిళ గత జూన్‌లోనే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.