యాప్నగరం

Teachers Day: బ్రిడ్జ్‌ కిందే పాఠాలు.. పేద పిల్లల మాస్టారు

ఉపాధ్యాయ దినోత్సవం (Teachers Day) సందర్భంగా ఢిల్లీలో ఓ అరుదైన ఉపాద్యాయుడు గురించి చెప్పుకోవాల్సిందే. అతనే రాజేష్ కుమార్ శర్మ. ఈయన స్వతాహాగా టీచర్ కాదు కానీ.. ఉపాధ్యాయుడిగా మారి.. పేద పిల్లలకు వరంగా మారారు. మురికి వాడల్లోని పిల్లలకు ఉచితంగా విద్యనందిస్తున్నారు. వంతెన కిందే పాఠశాలను నడుపుతున్నారు. దాదాపుగా 250 మంది చదువుకుంటున్నారు. ఈయనతో మరో నలుగురు ఉపాధ్యాయులు పిల్లలకు ఫ్రీగా చదువు చెబుతున్నారు. మొదట్లో ఇద్దరే ఉండే ఈ పాఠశాలలో ఇప్పుడు 250 మందికిపైగా అయ్యారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 5 Sep 2022, 6:32 pm

ప్రధానాంశాలు:

  • ఢిల్లీలో గల్లీ పిల్లలకు విద్యాబోధన
  • వంతెన కిందే ఉచిత స్కూల్
  • 250 మందికి విద్యనందిస్తున్న రాజేష్ కుమార్

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Rajesh Kumar Sharma
Teachers Day: సమాజంలో మంచి పౌరులను తీర్చిదిద్దేది.. గురువులు. పిల్లలకు విద్యాబుద్ధులను నేర్పించి.. సంస్కారవంతులుగా మలుస్తారు. మనస్సున్న మనుషులుగా, మానవత్వాన్ని పెంచే వ్యక్తులగా మారుస్తారు. అలాంటి గొప్ప వ్యక్తులను ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున గుర్తు చేసుకోవాల్సిందే. అయితే జీతాలు తీసుకుని.. పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులే కాదు.. సొంత ఖర్చులతో పేద పిల్లలకు ఉచితంగా విద్యనందించే టీచర్లు మన దేశంలో ఉన్నారు. అలాంటి వ్యక్తే రాజేష్ కుమార్ శర్మ. ఈయన ఢిల్లీలో ఉచిత పాఠశాలను నడుపుతున్నారు. 250 మంది పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజేష్ కుమార్ శర్మ (52) ఢిల్లీలోని యమునా బ్యాంక్ డిపో సమీపంలోని ఫ్లైఓవర్ కింద ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉచిత పాఠశాల నడుపుతున్నారు. యమునా నదికి సమీపంలో ఉన్న మురికివాడల్లో పిల్లలకు ఆయన చదువు చెబుతున్నారు. పేద బాలబాలికలు విద్యనందించాలనే గొప్ప ఉద్దేశంతో.. 2006లో ఉచిత పాఠశాలను ప్రారంభించారు. అప్పుడు కేవలం ఇద్దరు మాత్రమే ఉండేవారు. శర్మ వారికి చెట్టు కిందే పాఠాలు చెప్పేవారు. ఇప్పుడు విద్యార్థుల సంఖ్య 250కి పెరిగింది.

ప్రస్తుతం పాఠశాలలో రాజేష్ కుమార్ శర్మతోపాటు మరో నలుగురు ఉపాధ్యాయులు కూడా చేరారు.లక్ష్మీ చంద్ర, కంచన్, శ్యామ్ మెహ ఏమి ఆశించకుండా విద్యనందిస్తున్నారు. పాఠశాలలో సోమవారం నుంచి శనివారం వరకు రెండు షిఫ్టులుగా తరగతులు నిర్వహిస్తున్నారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9.30 నుంచి 11 వరకు, సాయంత్రం సాయంత్రం షిఫ్ట్ 2 నుంచి 5 వరకు నడుస్తుంది. "ఉదయం షిఫ్ట్‌లో 150 మంది బాలికలు, మధ్యాహ్నం షిఫ్టులో 100 మంది బాలురు ఉన్నారు. నేను ప్రారంభించినప్పుడు, అది నేను మాత్రమే. కానీ ఇప్పుడు స్వచ్ఛందంగా బోధించే మరో నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు." అని శర్మ చెప్పారు.

అయితే రాజేష్ శర్మ ఉపాధ్యాయుడు కాదు.. ఆయన నడిపే పాఠశాలకు ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదు. కేవలం పేద పిల్లలకు విద్యనందించాలనే మంచి ఉద్దేశంతో పాఠాలు బోధిస్తున్నారు. విద్యను అందించడమే కాదు.. బాగా చదవాలనుకునే వారికి ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తారు. స్కూల్లో చేరడానికి అవసరమైన అన్నింట్లో సహాయ పడతారు.

ఇంజనీర్ అవ్వాలనుకుని...
యూపీలోని హత్రాస్ జిల్లాకు చెందిన శర్మ ఇంజనీర్ అవ్వాలనుకున్నారు. కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా అతని ఆశ తీరలేదు. 1995లో చదువు మానేసి జీవనోపాధి కోసం ఢిల్లీ వచ్చారు. "ఇంట్లో ఆర్థిక పరిస్థితి కారణంగా నేను ఇంజనీరింగ్ చేయలేకపోయాను. సైన్స్‌లో నా బ్యాచిలర్ డిగ్రీని మధ్యలోనే వదిలి జీవనోపాధి కోసం ఇక్కడకు వచ్చాను. ప్రారంభంలో ఒక చిన్న కిరాణా దుకాణాన్ని కూడా ప్రారంభించాను. నా జీవనోపాధిని చూసుకుంటూనే ఇప్పుడు చెట్టు కింద పిల్లలకు పాఠాలు బోధించడం ప్రారంభించాను." అని శర్మ చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.