ఓ చాయ్వాలా నరేంద్ర మోదీ దేశానికి ప్రధాని మంత్రి అయి చరిత్ర సృష్టిస్తే, కేవలం టీ అమ్ముకోవడం ద్వారా నెలకు రూ.12 లక్షలు ఆదాయం పొందుతూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు మరో వ్యక్తి. ఇప్పుడు పుణేలోని ‘యెవ్లే టీ హౌస్’ పేరు మార్మోగిపోతుంది. ఈ టీ హౌస్ సహ-వ్యవస్థాపకుడైన నవ్నాథ్ యెవ్లే మాట్లాడుతూ త్వరలోనే తమ బ్రాండ్ను అంతర్జాతీయంగానూ విస్తరిస్తామని తెలియజేశాడు. పకోడా వ్యాపారమే కాదు, టీ అమ్మడం ద్వారానూ దేశంలోని నిరుద్యోగులకు ఉపాథి కల్పించవచ్చని వ్యాఖ్యానిస్తున్నాడు. తన వ్యాపారం బాగా సాగుతున్నందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. యెవ్లే టీ హౌస్కు పుణేలో ప్రస్తుతం మూడు బ్రాంచ్లు ఉన్నాయి. ప్రతీ బ్రాంచ్లోనూ 12 మంది పనిచేస్తున్నారు. నెలకు రూ.12 లక్షలకు పైగా ఆదాయం లభిస్తోంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రధాని నిరుద్యోగం గురించి మాట్లాడుతూ... ‘పకోడా అమ్ముకోవటం కూడా ఉద్యోగ కల్పనలో భాగమే. రోజుకు 200రూ. సంపాదించినా నిరుద్యోగ సమస్యను రూపుమాపినట్లే కదా’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. పుణేవారి ఛాయ్ అమ్మి నెలకు రూ.12 లక్షలు సంపాదిస్తున్నాడని తెలిస్తే, టీ అమ్ముకోమని సలహా ఇస్తారా? కొందరు ఎద్దేవా చేస్తున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రధాని నిరుద్యోగం గురించి మాట్లాడుతూ... ‘పకోడా అమ్ముకోవటం కూడా ఉద్యోగ కల్పనలో భాగమే. రోజుకు 200రూ. సంపాదించినా నిరుద్యోగ సమస్యను రూపుమాపినట్లే కదా’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. పుణేవారి ఛాయ్ అమ్మి నెలకు రూ.12 లక్షలు సంపాదిస్తున్నాడని తెలిస్తే, టీ అమ్ముకోమని సలహా ఇస్తారా? కొందరు ఎద్దేవా చేస్తున్నారు.