యాప్నగరం

నా తీర్పు అపార్థం చేసుకున్నారు.. మేఘాలయ జడ్జి వివరణ

భారత్ మరో ఇస్లామిక్ దేశంగా మారకూడదని, అదే జరిగితే భారత్‌కు, ప్రపంచానికి కూడా మంచిది కాదంటూ ఓ కేసు తీర్పులో తాను పేర్కొన్న విషయం నిజమేనన్నారు.

Samayam Telugu 15 Dec 2018, 11:29 pm
భారతదేశాన్ని అప్పుడే హిందూ దేశంగా ప్రకటించాల్సి ఉండేనంటూ తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మేఘాలయ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుదీప్ రజన్ సేన్ వివరణ ఇచ్చుకున్నారు. తన తీర్పు అసలు ఉద్దేశం అది కాదని, తీర్పును అపార్థం చేసుకున్నారని చెప్పారు. దేశ విభజన జరిగినప్పుడే భారతదేశాన్ని హిందూదేశంగా ప్రకటించి ఉండాల్సిందంటూ వ్యాఖ్యానించడంలో రాజకీయ పరమైన సంకేతాలు లేవని చెప్పారు.
Samayam Telugu Judge


భారత్ మరో ఇస్లామిక్ దేశం కాకూడదని, అదే జరిగితే భారత్‌కు, ప్రపంచానికి కూడా మంచిది కాదంటూ ఓ కేసు తీర్పులో తాను పేర్కొన్న విషయం నిజమేనన్నారు. దేశ విభజన సమయంలో హిందూ దేశంగా ప్రకటించి ఉండే ప్రశాంతంగా ఉండేదని ఆయన చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. రిటైర్మెంట్ అయ్యాక రాజకీయాల్లోకి రావాలని కూడా లేదు. అందువల్ల నా తీర్పును రాజకీయం చేయడానికి తగదు.

నిజనిజాలు ఏవైనా చరిత్ర, నిజం ఎప్పటికీ మారవు. వీటిని ఆధారంగానే నేను ఆ వ్యాఖ్యలు చేశాను. ప్రజలు దేశ చరిత్రను తెలుసుకుని మతసామరస్యంతో మెలగాలి. అంతేకానీ ఎవరినో కించపరిచేందుకు తాను వ్యాఖ్యలు చేయలేదని’ ఎస్ఆర్ సేన్ వివరించారు. భారత్ లౌకిక దేశమని, మతాలు, కులాలు, భాషల పేరుతో ఎలాంటి విధ్వేషాలు లేకుండా జీవించాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.