రాష్ట్రపతి అభ్యర్థిగా మీరా కుమార్ బుధవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీల (16 పార్టీలు) ఉమ్మడి అభ్యర్థిగా మీరా కుమార్ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మీరా కుమార్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీపీఎం నేత సీతారాం ఏచూరి తదితరులు హాజరయ్యారు.
గుజరాత్ సబర్మితి నుంచి జూన్ 30 మీరాకుమార్ తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. తనది రాష్ట్రపతి ఎన్నికలో సైద్ధాంతిక పోరాటమే తప్ప కుల పోరు కాదని మీరా కుమార్ స్పష్టం చేశారు.
ఎన్డీయే అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ పోటీ చేస్తుండగా... ప్రతిక్షాల క్యాండిడేట్ గా మీరాకుమార్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. జులై 17న రాష్ట్రపతి పదవికి ఎన్నిక జరుగనుంది.
గుజరాత్ సబర్మితి నుంచి జూన్ 30 మీరాకుమార్ తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. తనది రాష్ట్రపతి ఎన్నికలో సైద్ధాంతిక పోరాటమే తప్ప కుల పోరు కాదని మీరా కుమార్ స్పష్టం చేశారు.
ఎన్డీయే అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ పోటీ చేస్తుండగా... ప్రతిక్షాల క్యాండిడేట్ గా మీరాకుమార్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. జులై 17న రాష్ట్రపతి పదవికి ఎన్నిక జరుగనుంది.