యాప్నగరం

మోదీ మమ్మల్ని బెదిరించారు..రాష్ట్రపతికి మన్మోహన్ లేఖ

మోదీపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. దీనికి సంబంధించి కోవింద్‌కు ఓ లేఖ రాశారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని కాంగ్రెస్‌ను బెదిరించే ధోరణిలో మాట్లాడారని అందులో ప్రస్తావించారు.

Samayam Telugu 14 May 2018, 5:32 pm
మోదీపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. దీనికి సంబంధించి కోవింద్‌కు ఓ లేఖ రాశారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని కాంగ్రెస్‌ను బెదిరించే ధోరణిలో మాట్లాడారని అందులో ప్రస్తావించారు. మోదీ మాటలు అవమానపరచేలా... శాంతికి విఘాతం కలిగిస్తూ రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తులెవరూ అలాంటి భాషను మాట్లాడరని... ఈ ప్రవర్తనను ఎవరూ అంగీకరించరని లేఖలో చెప్పుకొచ్చారు. ప్రధాని హోదాలో ఉన్న హుందాగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు మన్మోహన్.

రాష్ట్రపతికి రాసిన లేఖలో మన్మోహన్ సింగ్, మల్లిఖార్జున్ ఖర్గే, చిదంబరం, దిగ్వజయ్ సింగ్, అహ్మద్ పటేల్, అంబికా సోనీతో పాటూ మరికొందరు నేతలు సంతకాలు కూడా చేశారు. మే 6న కర్ణాటకలోని హుబ్లీలో జరిగిన బహిరంగ సభలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపిస్తోంది. కాంగ్రెస్ నేతలు చెవులు పెద్దవిగా చేసుకుని నా మాటలు వినండి. మీరు హద్దులు దాటితే... నేను మోదీని... మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని మోదీ బెదిరించినట్టు ఈ లేఖలో ప్రస్తావించారు.

Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.