గంగా స్నానం.. సర్వపాప హరణం అన్నారు పెద్దలు... గంగా నదిలో మునకేస్తే సకల పాపాలు తొలగిపోతాయనేది హిందువుల నమ్మకం. ముక్తి నదిలో మూడు మునకలేస్తే గండాలు, పాపాలు తొలగిపోతాయనేది నానుడి. కానీ కొందరు భార్యాబాధితులు మాత్రం గంగలో పుణ్యస్నానాలు ఆచరించి వారికి పిండ ప్రదానం నిర్వహించడం విశేషం. ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఏటా పుణ్య స్నానాలు ఆచరించి, మాజీ భార్యల పేరిటి పిశాచినీ ముక్తి పూజలు నిర్వహిస్తారు. సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కొందరు గతవారం కాశీలోని గంగా నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి 150 మంది వ్యక్తులు వారణాసి చేరుకున్నారు. ఇలా చేస్తే తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉంటాయనేది వారి ప్రగాఢ నమ్మకం.
దీని గురించి సిఫ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాజేశ్ వఖారియా మాట్లాడుతూ..‘దేశంలో పురుషులకు సమానమైన న్యాయవ్యవస్థ లేదని, చట్టాలన్నీ మగాళ్లకు వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. జంతువుల సంక్షేమానికి మంత్రిత్వ శాఖ ఉంది కానీ పురుషుల సంక్షేమ శాఖ లేదు.. అంటే దేశంలోని మగవారు జంతువులకంటే హీనమా? అని పేర్కొన్నారు. అలాగే భార్యలతో వేధింపబడ్డ భర్తలు ఏటా వారణాసిలోని గంగా నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తారని, వచ్చేవారిలో చాలా మంది భార్యా బాధితులేనని ఆయన తెలిపారు. అందుకే కుటుంబంలో భార్య, ఇతర సభ్యులతో ఎలాంటి విభేదాలు, కలహాలు రాకుండా ఇలా పుణ్య స్నానాలు ఆచరిస్తుంటామని తెలిపారు. అంతేకాదు భార్యల హింసను తట్టుకోలేక పలువురు భర్తలు వారిపేరిట ముక్తి పిశాచిని పూజ నిర్వహించి పిండ ప్రదానాలు కూడా చేస్తారని తెలియజేశారు.
మన దేశంలో మహిళా సాధికారత పేరిట అందరూ మగవాళ్లని నీచులుగా చూస్తున్నారని రాజేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్ల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం వెనుక అమిత్ దేశ్పాండే అనే మరో పురుష హక్కుల కార్యకర్త ఆలోచన కూడా ఉంది. భార్యతో వేధింపబడ్డ భర్తలు తమ వివాహ బంధానికి అంతిమ సంస్కారం నిర్వహించాలని అమిత్ వెల్లడించారు. అనేక ఏళ్లుగా బాధితులైన భర్తలకు భార్యలు మనశ్శాంతి దూరం చేస్తారని అన్నారు. భార్యా బాధితులు పవిత్రమైన గంగలో స్నానం చేసి పిండ ప్రదానం చేస్తారని చెప్పారు. మాజీ భార్యల నుంచి ఎదురైన చేదు అనుభవాలను గంగలో మునిగి, పిశాచిని ముక్తి పూజతో వదిలించుకుంటామని అన్నారు.
దీని గురించి సిఫ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాజేశ్ వఖారియా మాట్లాడుతూ..‘దేశంలో పురుషులకు సమానమైన న్యాయవ్యవస్థ లేదని, చట్టాలన్నీ మగాళ్లకు వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. జంతువుల సంక్షేమానికి మంత్రిత్వ శాఖ ఉంది కానీ పురుషుల సంక్షేమ శాఖ లేదు.. అంటే దేశంలోని మగవారు జంతువులకంటే హీనమా? అని పేర్కొన్నారు. అలాగే భార్యలతో వేధింపబడ్డ భర్తలు ఏటా వారణాసిలోని గంగా నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తారని, వచ్చేవారిలో చాలా మంది భార్యా బాధితులేనని ఆయన తెలిపారు. అందుకే కుటుంబంలో భార్య, ఇతర సభ్యులతో ఎలాంటి విభేదాలు, కలహాలు రాకుండా ఇలా పుణ్య స్నానాలు ఆచరిస్తుంటామని తెలిపారు. అంతేకాదు భార్యల హింసను తట్టుకోలేక పలువురు భర్తలు వారిపేరిట ముక్తి పిశాచిని పూజ నిర్వహించి పిండ ప్రదానాలు కూడా చేస్తారని తెలియజేశారు.
మన దేశంలో మహిళా సాధికారత పేరిట అందరూ మగవాళ్లని నీచులుగా చూస్తున్నారని రాజేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్ల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం వెనుక అమిత్ దేశ్పాండే అనే మరో పురుష హక్కుల కార్యకర్త ఆలోచన కూడా ఉంది. భార్యతో వేధింపబడ్డ భర్తలు తమ వివాహ బంధానికి అంతిమ సంస్కారం నిర్వహించాలని అమిత్ వెల్లడించారు. అనేక ఏళ్లుగా బాధితులైన భర్తలకు భార్యలు మనశ్శాంతి దూరం చేస్తారని అన్నారు. భార్యా బాధితులు పవిత్రమైన గంగలో స్నానం చేసి పిండ ప్రదానం చేస్తారని చెప్పారు. మాజీ భార్యల నుంచి ఎదురైన చేదు అనుభవాలను గంగలో మునిగి, పిశాచిని ముక్తి పూజతో వదిలించుకుంటామని అన్నారు.