యాప్నగరం

బీజేపీలో చేరిన మెట్రో మ్యాన్.. సీఎం కల నెరవేరుతుందా?

Kerala: దేశంలో కీలక మెట్రో రైలు ప్రాజక్టులను పూర్తి చేసి మెట్రో మ్యాన్‌గా గుర్తింపు పొందిన ఈ శ్రీధరన్.. బీజేపీ పార్టీలో చేరారు. తన మనసులో మాటను కూడా బహిరంగంగా చెప్పేశారు.

Samayam Telugu 26 Feb 2021, 8:24 pm
మెట్రో మ్యాన్‌ ఈ శ్రీధరన్‌ బీజేపీలో చేరారు. గురువారం (ఫిబ్రవరి 25) రాత్రి మలప్పురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆ రాష్ట్ర బీజేపీ శాఖకు మెట్రో మ్యాన్ రాక అదనపు బలాన్ని ఇవ్వనుంది. దేశంలో అనేక మెట్రో రైలు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయడంలో శ్రీధరన్‌ కీలక పాత్ర పోషించారు.
Samayam Telugu మెట్రో మ్యాన్
Metro Man Sreedharan


88 ఏళ్ల మెట్రో మ్యాన్‌ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల కిందట మీడియాతో మాట్లాడుతూ బీజేపీలో చేరనున్నట్టు తెలిపారు. అంతేకాదు, అవకాశం వస్తే కేరళ సీఎం పదవి చేపడతానంటూ తన మనసులో మాటను బహిరంగంగానే చెప్పేశారు.


అయితే, తన ప్రధాన లక్ష్యం కేరళలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమేనని శ్రీధరన్ వ్యాఖ్యానించారు. బీజేపీ కోరితేనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు.

Also Read:

ఏనుగును ఎంత దారుణంగా కొట్టారో చూడండి..

నిద్రలో నడిచే అలవాటు.. అర్ధరాత్రి ఘోరం జరిగిపోయింది!

ఈ కొత్త జంటకు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా.. మీరు అస్సలు షాకవ్వరు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.