యాప్నగరం

కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌కు తప్పిన ప్రమాదం..!

దక్షిణాఫ్రికాలో జరగనున్న బ్రిక్స్‌ దేశాల సమావేశానికి విమానంలో బయలుదేరిన కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న విమానం 14 నిమిషాల పాటు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ)నుంచి సంబంధాలు తెగిపోయింది.

Samayam Telugu 3 Jun 2018, 10:15 pm
దక్షిణాఫ్రికాలో జరగనున్న బ్రిక్స్‌ దేశాల సమావేశానికి 'ఐఎఫ్‌సి-31' విమానంలో బయలుదేరిన కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న విమానం 14 నిమిషాల పాటు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ)నుంచి సంబంధాలు తెగిపోవడమే ఇందుకు కారణం. ఆమె ఆదివారం (జూన్ 3) మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తిరువనంతపురం నుంచి మారిషస్‌కు ప్రత్యేక విమానంలో బయలుదేరారు.
Samayam Telugu sushma


అయితే మార్గమధ్యలో ఉండగా సాయంత్రం 4.44 గంటలకు విమానానికి రాడార్స్‌ నుంచి సిగ్నల్స్‌ ఆగిపోయాయి. దీంతో అప్రమత్తమైన మారిషస్‌ ఏటీసీ ఒక్కసారిగా ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ఆ తరువాత సరిగ్గా 4.58 నిమిషాలకు ఐఎఫ్‌సి31‌ అందుబాటులోకి వచ్చిందని, మారిషస్‌లో ల్యాండ్ అయినట్లు ఆదేశ ఏటీసీ ప్రకటించింది. దీంతో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఊపిరిపీల్చుకుంది. ఐఎఫ్‌సి-31 అక్కడి నుంచి మళ్లీ సౌతాఫ్రికాకు బయలుదేరింది.

అయితే ప్రపంచ ఏటీసీ నిబంధనల ప్రకారం.. సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్న ఒక విమానానికి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోతే.. దానితో కమ్యూనికేషన్ పునరుద్ధరనకు 30 నిమిషాల వరకు ఎదురు చూస్తుంది. అప్పటికీ ఆ విమానంతో సంబంధాలు పునరుద్ధరణ కాకపోతే ప్లేన్ మిస్ అయినట్లు ప్రకటిస్తుంది. అయితే విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తి వీఐపీ కావడంతో వెంటనే ఐఎన్‌సీఆర్‌ఎఫ్‌ఏను యాక్టివేట్‌ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.