యాప్నగరం

విరిగిన కాలుతోనే నడక.. వలస కూలీ కష్టం.. కదిలిస్తోన్న చిత్రం

లాక్‌డౌన్ కారణంగా పట్టణాలు, నగరాల్లో ఉపాధి లేకపోవడంతో వలస కూలీలు తిరిగి సొంతూళ్లకు మళ్లుతున్నారు. వందల కి.మీ. నడిచి వెళ్లడానికి సిద్ధపడుతున్నారు.

Samayam Telugu 31 Mar 2020, 3:25 pm
లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో నగరాల నుంచి వలస కూలీలు తిరిగి సొంతూళ్లకు మళ్లుతున్నారు. వాహనాలు, రవాణా లేకపోవడంతో.. వందల కిలోమీటర్ల దూరం కాలినడకనే వెళ్తున్నారు. వేలాది మంది వలస కూలీలు రాష్ట్రాలను దాటి సొంతూళ్లకు వెళ్తుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. ఎక్కడి వాళ్లను అక్కడే ఉంచాలని, వలస కూలీలకు ఆహారం, వసతి సమకూర్చాలని రాష్ట్రాలను ఆదేశించింది. అయినప్పలికీ వలసలు మాత్రం ఆగడం లేదు.
Samayam Telugu mp migrant worker


మధ్యప్రదేశ్‌లో దినసరి కూలీగా పని చేసే భన్వర్‌లాల్ అనే వ్యక్తి కాలికి సిమెంట్ కట్టుతోనే సొంతూరుకు వెళ్తున్న ఫొటో వైరల్‌గా మారింది. మూడు వేళ్లు, కాలి మడమకు గాయం కావడంతో ఇటీవల అతడి కాలుకు సిమెంట్ కట్టు కట్టారు. కానీ దాంతో నడవడానికి ఇబ్బంది కలగడంతో.. అతడు రోడ్డు మీద కూర్చొని కత్తెరతో దాన్ని కత్తిరిస్తోన్న ఫొటో.. వలస కూలీల కష్టాలను కళ్లకు కట్టింది.

పిపారియన్ పట్టణంలో దినసరి కూలీగా పని చేసే భన్వర్‌లాల్‌ది రాజస్థాన్. 500 కి.మీ. ఓ వాహనంలో వచ్చేసిన అతడు.. మరో 240 కి.మీ. వెళ్తే.. సొంతూరు చేరుకుంటాడు. దీంతో కాలికి గాయమై, కట్టు కట్టినప్పటికీ.. అంత దూరం నడవడానికి అతడు సిద్ధపడ్డాడు. సరిహద్దుల వద్ద పోలీసులు ఆపుతున్నప్పటికీ తనకు మరో దారి లేదన్నాడు. నా కుటుంబం ఒంటరిగా ఉంది, నాకేమో పని లేదు. వారికి నేను డబ్బులు పంపలేను. నడవడం కోసం ఈ ప్లాస్టర్‌ను కత్తిరించాల్సిందేనని అతడు చెప్పాడు.

Read Also: కరోనాకు విరుగుడు మందు తీసుకొని.. డాక్టర్ మరణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.