యాప్నగరం

దేశ రాజధానిలో భూకంపం.. భయాందోళనల్లో జనం

ఆదివారం సాయంత్రం దేశరాజధాని, పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూప్రంకపనలు చోటు చేసుకున్నాయి. భూకంప కేంద్రం హర్యానాలో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది.

Samayam Telugu 9 Sep 2018, 6:54 pm
దేశ రాజధాని, పరిసర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భూమి స్వల్పంగా కంపించింది. భూకంప కేంద్రం హర్యానాలోని ఝజ్జర్‌లో ఉందని గుర్తించారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.8గా నమోదైందని తెలుస్తోంది. భూగర్భంలో పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఆదివారం సాయంత్రం 4.37 గంటలకు భూమి కంపించగా.. ఢిల్లీ, హర్యానా, గుర్గావ్‌, ఉత్తర ప్రదేశ్‌లలో ప్రకంపనల ప్రభావం కనిపించింది.
Samayam Telugu earthquake delhi


భూమి కంపించడంతో ఢిల్లీ, పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. దక్షిణ ఢిల్లీలో భూమి గట్టిగా కంపించిందని ఒకరు ట్వీట్ చేయగా.. దేశ రాజధాని ప్రాంతంలో భూంకపం వచ్చిందా? అని మరొకరు ఆరా తీసే ప్రయత్నం చేశారు. ప్రకంపనలు తర్వాత కొనసాగలేదని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.