యాప్నగరం

భారత్‌లోకి చొరబాటుకు 475 మంది మిలిటెంట్స్ సిద్ధం

భారత్-పాకిస్థాన్ సరిహద్దు రేఖ వెంట అవకాశం చూసుకుని భారత్‌లోకి చొరబడేందుకు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 475 మంది మిలిటెంట్లు...

TNN 8 Sep 2017, 12:26 am
భారత్-పాకిస్థాన్ సరిహద్దు రేఖ వెంట అవకాశం చూసుకుని భారత్‌లోకి చొరబడేందుకు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 475 మంది మిలిటెంట్లు సిద్ధంగా వున్నారని అన్నారు నార్త‌ర్న్ క‌మాండ్‌కు చెందిన‌ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ దేవరాజ్ అంబూ. నార్తర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్స్‌లో గురువారం ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన దేవరాజ్ అంబూ విలేకరులు అడిగిన అనేక ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు. శత్రువుల కదలకలు పసిగట్టి ఎప్పటికప్పుడు వారికి తగిన విధంగా బుద్ధి చెబుతుండటంతో గతతో పోల్చుకుంటే ఈ ఏడాది చొరబాట్లు గణనీయంగా తగ్గాయని అన్నారు అంబూ. కాశ్మీర్‌లో కీల‌క‌మైన‌ పిర్ పంజ‌ల్ స‌మీపంలో ఉగ్ర క్యాంపులు, ల్యాంచ్ ప్యాడ్‌లు ఉన్నాయ‌ని జనరల్ అంబూ స్పష్టంచేశారు.
Samayam Telugu militants are waiting to sneak into the indian side lt gen devraj anbu
భారత్‌లోకి చొరబాటుకు 475 మంది మిలిటెంట్స్ సిద్ధం


ప్ర‌తి ఏడాది ఉగ్ర‌వాదులు అనేకసార్లు చొర‌బాటు ప్ర‌య‌త్నాలు చేస్తుంటార‌ు. అలాగే ఈ ఏడాది కూడా చాలా చొరబాటు ప్రయత్నాలు జరిగాయి. కానీ ఈ ఏడాదిలో శత్రువులు భారత్‌లోకి చొరబడేందుకు చేసిన కుట్రల్లో సఫలమైంది చాలా త‌క్కువ సందర్భాలే. కాశ్మీర్‌లో మిలిటెంట్ల కదలికలు తగ్గాయి. గత నాలుగు నెలల్లో 100 మంది మిలిటెంట్లని మట్టుపెట్టాం. ఈ ఏడాదిలో మొత్తం 144 మంది మిలిటెంట్లు తమ తుపాకులకి బలయ్యారు అని జనరల్ అంబూ తెలిపారు.

శత్రువులపై ఆపరేషన్ పూర్తిచేసిన ప్రతీసారి స్థానికులతో మమేకమై వారికి పరిస్థితిని అర్థమయ్యేలా వివరిస్తున్నాం. మిలిటెంట్లని హతమార్చే సందర్భాల్లోనూ స్థానికులకి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఫలితంగా స్థానికంగా వారి మద్దతు పొందగలుగుతున్నాం. స్థానిక యువతకి మిలిటెంట్లు గాలం వేయకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. ఆర్థిక ఇబ్బందుల్లో వున్న నిరుద్యోగులకి గాలం వేసేందుకు మిలిటెంట్స్ ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. కానీ వాళ్ల ఆటలు సాగనివ్వడం లేదు. స్థానిక యువతకి ఉపాధి లభిస్తే, తమ ప్రయత్నాల్లో మరింత పురోగతి కనిపిస్తుంది అని​ జనరల్ అంబూ అభిప్రాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.