యాప్నగరం

విహార యాత్రలో ఘోర విషాదం.. 32 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సతారా జిల్లాలోని అంబేనలి ఘాట్‌లో ఓ ప్రైవేటు బస్సు లోయలో పడి 32 మంది చనిపోయారు.

Samayam Telugu 28 Jul 2018, 5:37 pm
హారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సతారా జిల్లాలోని అంబేనలి ఘాట్‌లో ఓ ప్రైవేటు బస్సు లోయలో పడి 32 మంది చనిపోయారు. వారాంతం కావడంతో కొంకణ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 33 మంది మహాబలేశ్వరం విహార యాత్రకు బయల్దేరారు. బస్సు పొలాద్‌పూర్ చేరగానే అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమాదం సమయంలో బస్సులో డ్రైవర్, క్లీనర్‌తో పాటు 35 మంది ఉన్నారు.
Samayam Telugu 1221


ఈ సమాచారం తెలియగానే పోలీసులు, అధికారులు ఘటనా స్థలికి చేరి సహాయక చర్యలు చేపట్టారు. ఉదయం 11.30 గంటల సమయంలో బస్సు పొలాద్‌పూర్ ఘాట్ రోడ్డు మీద మలుపు తిరుగుతుండగా బస్సు ఒక్కసారిగా పక్కకి ఒరిగి లోయలో పడిపోయింది. దాదాపు 200 అడుగుల లోతైన లోయలోకి పడటంతో బస్సు నుజ్జునుజ్జయ్యింది. బస్సు లోయలోకి పడక ముందే ఓ ప్రయాణికుడు బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ప్రమాద సమయానికి ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ఆ వ్యక్తే స్థానికులకు సమాచారం ఇచ్చాడు. ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు సైతం ఘటనా స్థలానికి చేరి, సహాయక చర్యలు చేపడుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.