యాప్నగరం

సర్పంచ్ కావాలంటే.. పది ఉండాల్సిందే!

కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిప్రకారం.. ఇకపై సర్పంచ్ పదవికి పోటీ చేయాలనుకునే అభ్యర్థులు పదోతరగతి తప్పనిసరిగా పాసై ఉండాలి.

Samayam Telugu 1 Jun 2018, 7:48 pm
కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిప్రకారం.. ఇకపై సర్పంచ్ పదవికి పోటీ చేయాలనుకునే అభ్యర్థులు పదోతరగతి తప్పనిసరిగా పాసై ఉండాలి. ఈ మేరకు నిబంధన సిద్ధం చేసిన కేంద్రం.. దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. ఈ విద్యార్హత అమల్లోకి వస్తే మాత్రం.. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా బరిలోకి దిగే అభ్యర్థులు పదోతరగతి పాసై ఉండాల్సిందే. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆమోదించినట్లు తెలిసింది.
Samayam Telugu sarpanch


ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లాపరిషత్‌ చైర్మన్‌ పదవులకు కూడా విద్యార్హతలను ఖరారు చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులకు కూడా కనీస విద్యార్హత నియమాన్ని తీసుకురావాలనుకున్నప్పటికీ.. ఇప్పటికిప్పుడే దీనిపై నిర్ణయం తీసుకోకూడదని భావిస్తోంది.

బ్యాంకు కార్యకలాపాలకు సంబంధించి సర్పంచ్‌లకు బ్యాంక్‌ చెక్‌లపై సంతకం పెట్టే అధికారం ఉంది. దీంతో చదువురాని వారిని సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్‌ వంటి కీలక పదవుల్లో కూర్చోబెట్టి.. వారి కుటుంబ సభ్యులు పెత్తనం చెలాయిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో.. కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.