యాప్నగరం

Karnataka పట్టా కోసం నిలదీసిన మహిళ.. చెంపచెళ్లుమనిపించిన మంత్రి.. వైరల్ వీడియో

తనకు అన్యాయం జరిగిందని వాపోతూ తన గోడును వెళ్లబోసుకున్న ఓ మహిళ.. ఈ విషయంలో తన ఊరికి వచ్చిన మంత్రిని నిలదీసింది. తనకు పట్టా రాకుండా అడ్డుకున్నారని, సిఫార్సుల చేసిన వారికే పెద్ద పీట వేశారని ఆమె ఆరోపించింది. దీంతో మంత్రిగారికి ఎక్కడలేని రోషం పొడుచుకొచ్చి ఆమె చెంప చెళ్లుమనిపించారు. అయినా కూడా ఆమె మంత్రి కాళ్లపై పడి తనకు న్యాయం చేయాలని వేడుకోవడం గమనార్హం. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 23 Oct 2022, 12:21 pm

ప్రధానాంశాలు:

  • లబ్దదారులకు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి
  • తనకు అన్యాయం జరిగిందని నిలదీసిన మహిళ
  • ఆగ్రహంతో ఊగిపోయిన చేతికి పనిచెప్పిన నేత.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu మంత్రి సోమన్న
భూమి పట్టాల లబ్దిదారుల (Title Deed Beneficiaries) ఎంపిక విషయంలో తనకు అన్యాయం జరిగిందని గోడు వెళ్లబోసుకోడానికి వేదికపైకి వచ్చిన మహిళపై ఓ మంత్రి ()రెచ్చపోయారు. తనను ప్రశ్నించిందని ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన.. ఆమె చెంప పగలగొట్టిన (Minister Slapped) ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రి తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో తర్వాత ఆయన క్షమాపణలు చెప్పారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కర్ణాటక (Karnataka) గృహ నిర్మాణ శాఖ మంత్రి వీ సోమన్న(Karnataka Minister Somanna) ఛామరాజ్‌నగర్ జిల్లాలోని హంగాలా గ్రామంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా 175 మందికి పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సమయంలో కెంపెమ్మ అనే ఓ మహిళ వేదికపైకి వచ్చి.. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరగలేదని ఆరోపించింది. అర్హత ఉన్నా తనను ఎంపిక చేయలేదని.. స్థానిక కాంగ్రెస్ (Congress) నాయకుడు నంజప్ప సూచించిన వారికే టైటిల్ డీడ్‌లు ఇచ్చారని ఆమె ఆరోపణలు చేశారు. ఈ విషయంలో మంత్రిని ఆమె నిలదీయడంతో అమాత్యుడు అహం దెబ్బతింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన.. కెంపెమ్మ చెంప ఛెళ్లుమనిపించారు. ఈ హఠాత్పరిణామానికి అక్కడి వాళ్లు షాక్ అయ్యారు. అయితే, చెంప దెబ్బ కొట్టిన తర్వాత కూడా ఆమె మంత్రి పాదాలకు నమస్కరించడం వీడియోలో కనిపిస్తోంది.


అక్కడే ఉన్న పోలీసులు.. ఆమెను వేదికపై నుంచి కిందకు దింపేశారు. వీడియో బయటకు రావడంతో మంత్రి క్షమాపణలు చెప్పారు. ఇటీవల బెంగళూరులో వరదలు సంభవించినప్పుడు తనను ప్రశ్నించిన ఓ మహిళపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలి శివాలెత్తి నోటికి పనిచెప్పారు. ఈ వీడియో సైతం వైరల్ అయ్యింది. అలాగే, జేడీఎస్ నేత ఓ కాలేజీ ప్రిన్సిపాల్‌‌కి చెంప పగలుగొట్టిన విషయం తెలిసిందే. కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు పనులకు సంబంధించి సరైన సమాధానం చెప్పకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన జేడీఎస్ నేత శ్రీనివాస్.. ప్రిన్సిపాల్‌పై భౌతిక దాడికి పాల్పడ్డారు.
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.