యాప్నగరం

అబ్బాయిల వేధింపులు.. ఒంటికి నిప్పంటించుకున్న బాలిక

పోకిరీల వేధింపులకు తీవ్ర మనస్తాపానికి గురైన ఓ బాలిక కిరోసిన్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

TNN 1 Apr 2018, 10:10 pm
పోకిరీల వేధింపులకు తీవ్ర మనస్తాపానికి గురైన ఓ బాలిక కిరోసిన్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకుంది. 80 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉంది. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా పదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలికను స్థానికంగా కొంత మంది తరచూ వేధిస్తున్నారు. బాలిక పాఠశాలకు వెళుతున్న మార్గంలో అడ్డుతగిలి లైంగికంగా వేధిస్తున్నారు. బాలికను పలుమార్లు బెదిరించి అసభ్యంగా ప్రవర్తించారు.
Samayam Telugu sagar


కొన్ని రోజులుగా వేధింపులు తీవ్రమవడంతో సదరు బాలిక మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు బాలురను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.