పదో తరగతి విద్యార్థిని ఒడిశాలో సామూహిక అత్యాచారానికి గురైంది. కామాంధులు ఆమెను తీవ్రంగా గాయపరిచి రోడ్డు మీదే వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొందమాల్ జిల్లా సింధికుడి గ్రామానికి చెందిన విద్యార్థిని (15) గత నెల 22న రాత్రి ఏడుగంటల సమయంల తన ఇంటి ముందు ఆరుబయట కూర్చుని ఉంది. అదే సమయంలో ముగ్గురు యువకులు ద్విచక్రవాహనాలపై అక్కడికి వచ్చారు. ఎవరూ చూడకుండా విద్యార్థినిని అక్కణ్నించి అపహరించారు. బలవంతంగా అమ్మాయిని బండిపై కూర్చొబెట్టుకుని అక్కణ్నించి తీసుకెళ్లారు. గ్రామ శివారులో ఉంచిన కారులో విద్యార్థినిని ఎక్కించి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. మొత్తం ముగ్గురు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను తీవ్రంగా కొట్టి రోడ్డుపక్కన పడేసి వెళ్లి పోయారు. రాత్రి వేళలో అటుగా వస్తున్న కొందరు ఆమెను గుర్తించి ఆసుపత్రిలో చేర్చారు. బాలిక ఆరోగ్యం కాస్త మెరుగయ్యాక కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. బాలిక చెప్పిన ఆధారాలతో ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు.
విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
పదో తరగతి విద్యార్థిని ఒడిశాలో సామూహిక అత్యాచారానికి గురైంది.
TNN 10 Jan 2017, 3:16 pm