యాప్నగరం

ప్రభుత్వం దానంతట అదే పడిపోతుంది!

రాజకీయ పరిణామాలపై ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు చేశాడు ప్రతిపక్ష నేత

TNN 29 Aug 2017, 9:06 am
తమిళనాడు రాజకీయ పరిణామాలపై ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు చేశాడు ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్. సీఎం పళనిసామి, మాజీ సీఎం పన్నీరు సెల్వం వర్గాల కలయిక పరిణామాలు, టీటీవీ దినకరన్ ఆధ్వర్యంలో కొంతమంది ఎమ్మెల్యేల తిరుగుబాటు పరిణామాలనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్నాడీఎంకే ప్రభుత్వం ఏ క్షణమైన పడిపోవచ్చని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదని.. అదే కూలిపోతుందని స్టాలిన్ వ్యాఖ్యానించారు.
Samayam Telugu mk stalin on tamilnadu latest political developments
ప్రభుత్వం దానంతట అదే పడిపోతుంది!


తాము పళనిసామి ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంటున్నామని 19 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ కు లేఖ రాశారు అని స్టాలిన్ గుర్తు చేశారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా దినకరన్ వెంట ఉన్నారని చెబుతున్నారన్నారు. ఇలాంటి నేపథ్యంలో పళనిసామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందన్నారు. ఈ విషయంలో తాము కూడా గవర్నర్ ను కలిసి చెప్పామని.. విశ్వాస పరీక్షకు ఆదేశించమని కోరామన్నారు.

అయితే గవర్నర్ నుంచి ఇంత వరకూ స్పందన రాలేదన్నారు. పళనిసామి, పన్నీరు సెల్వంల కలయికలో కనిపించడానికి గవర్నర్ ముంబై నుంచి ఆగమేఘాల మీద చెన్నైకి వచ్చారని.. అలా ఎందుకు వచ్చారో అర్థం కాలేదని స్టాలిన్ వ్యాఖ్యానించారు. మైనారిటీలో పడిపోయిన పళనిసామి ప్రభుత్వాన్ని బలనిరూపణకు ఆదేశించాలని తాము మళ్లీ కోరుతున్నామన్నారు. విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సి వస్తే.. పళనిసామి ప్రభుత్వం కుప్పకూలుతుందని స్టాలిన్ వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.