యాప్నగరం

ఎమ్మెల్యే అమిత్‌షా అసెంబ్లీకి వచ్చెన్!

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా గురువారం గుజరాత్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.

Samayam Telugu 30 Mar 2017, 2:43 pm
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా గురువారం గుజరాత్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అదేంటీ ఆయన పార్టీకి నేత కదా..? అసెంబ్లీలో సభ్యుడు కాదు కదా అనుకునేరు? ఆయన గుజరాత్ లోని నారన్ పుర అనే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Samayam Telugu mla amit shah attends assembly session after two years
ఎమ్మెల్యే అమిత్‌షా అసెంబ్లీకి వచ్చెన్!


అయితే పార్టీ కార్యకలపాల్లో దేశమంతా పర్యటించడం వల్ల రెండేళ్ల తర్వాత షా అసెంబ్లీకి వచ్చారు. 2015 మార్చిలో షా చివరిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. చాలాకాలం తర్వాత అసెంబ్లీకి వచ్చిన అమిత్ షాకు సీఎం విజయ్ రూపానీ, గుజరాత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జితు వఘాని, పార్టీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అమిత్ షా వెంట ఆయన భార్య, కొడుకు ఉన్నారు.

అమితి షా రెండు రోజుల పాటు గుజరాత్ లో ఉంటారు. ఈ యేడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యలో ఆయన పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చించనున్నారు.

182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ లో 150 స్థానాలు సాధించానే లక్ష్యంతో ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.