యాప్నగరం

దేశమే తొలి ప్రాధాన్యంగా.. ఆరు నెలల పాలన: ప్రధాని మోదీ

మోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వరుస ట్వీట్లు చేశారు. దేశానికి తొలి ప్రాధాన్యం ఇస్తూ తమ పాలన సాగుతోందన్నారు.

Samayam Telugu 30 Nov 2019, 9:07 pm
మోదీ 2.0 సర్కారు ఆరు నెలల పాలన పూర్తి చేసుకుంది. గత ఆరు నెలల్లో దేశాభివృద్ధి కోసం, సామాజిక సాధికారత కోసం, ఐక్యత పెంపొందించడం కోసం తాము తీసుకున్న నిర్ణయాలను ప్రధాని మోదీ వివరించారు. దేశానికి తొలి ప్రాధాన్యం ఇస్తూ తమ పాలన సాగిందని చెప్పడం కోసం 6monthsofIndiafirst అనే హ్యాష్ ట్యాగ్‌ను ప్రధాని మోదీ తన ట్వీట్లకు జత చేశారు. భవిష్యత్తులో మరిన్ని పనులు చేస్తామన్న మోదీ.. సమృద్ధ, ప్రగతిశీల నవ భారతాన్ని తీర్చిదిద్దుతామన్నారు.
Samayam Telugu modi 2 0 govt completes six months rule
దేశమే తొలి ప్రాధాన్యంగా.. ఆరు నెలల పాలన: ప్రధాని మోదీ


సబ్‌కా సాత్, సబ్ కా వికాస్, సబ్‌కా విశ్వాస్ అనే ధర్మసూత్రం ఆదర్శంగా.. 130 కోట్ల మంది భారతీయుల ఆశీస్సులతో ఎన్డీయే ప్రభుత్వం.. దేశాభివృద్ధి కోసం, ప్రజల సాధికారత కోసం, నూతన ఉత్సాహంతో పని చేస్తామని మోదీ తెలిపారు.

2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 303 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించి.. 2014 ఎన్నికల్లో కంటే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఆరు నెలల పాలన కాలంలో.. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, అయోధ్య తీర్పు లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేస్తామని ప్రకటించిన మోదీ సర్కారు.. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీపీ చేపడతామని ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.