యాప్నగరం

పేదలు, రైతుల వ్యతిరేక ప్రభుత్వం: రాహుల్

నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదలు, రైతుల వ్యతిరేక ప్రభుత్వమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు.

TNN 31 Mar 2017, 4:38 pm
నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదలు, రైతుల వ్యతిరేక ప్రభుత్వమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. తమిళనాడు కరువు బాధిత రైతాంగం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 18 రోజులుగా చేస్తున్న ఆందోళనకు రాహుల్ సంఘీభావం తెలిపారు. శుక్రవారం రైతులను కలిసి వారితో మాట్లాడారు.
Samayam Telugu modi govt anti poor and anti farmer accuses rahul gandhi
పేదలు, రైతుల వ్యతిరేక ప్రభుత్వం: రాహుల్


‘‘రైతులు చాలా రోజులుగా ఇక్కడే కూర్చున్నారు. ప్రభుత్వంగానీ, ప్రధానమంత్రి మోదీగానీ వీరిని పట్టించుకోవడం లేదు. కరువు బాధిత రైతులను ప్రధానమంత్రి అవమానపరుస్తున్నారు. తక్షణమే తమిళనాడు రైతులను చర్చలకు పిలవాలి’’ అని రాహుల్ అన్నారు.

గడిచిన మూడేళ్లలో 50 మంది పారిశ్రామికవేత్తలకు చెందిన రూ.1.4లక్షల కోట్లు మాఫీ చేశారని ఆరోపించిన రాహుల్.. ఇదే శ్రద్ధ రైతులపై ఏమైందని ప్రశ్నించారు.

15నిమిషాలపాటు రైతులతో మాట్లాడిన రాహుల్.. వారి డిమాండ్లను నోట్ చేసుకున్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటు, ఢిల్లీతోపాటు తమిళనాడులోనూ కాంగ్రెస్ పోరాడుతుందని రాహుల్ వారికి హామీ ఇచ్చారు.

తమిళనాడులో ప్రవహిస్తున్న కావేరీ నది పరివాహక రైతులు రూ.40వేల కోట్లు రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల రుణమాఫీతో పాటు కావేరీ మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

తమ డిమాండ్లు పరిష్కారం కాకపోతే ఇక్కడే ప్రాణాలు వదులుతామని రైతు నాయకుడు అయ్యకన్ను కేంద్రాన్ని హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.