యాప్నగరం

రూ.3కే కిలో బియ్యం, రూ.2కే గోధుమలు, కార్మికులకు వేతనంతో సెలవు.. మోదీ కేబినెట్ కీలక నిర్ణయాలు

Lockdown నేపథ్యంలో నిరుపేదలకు, కార్మికులకు ఇబ్బంది తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు బియ్యం, గోధుమలు సరఫరా చేయడానికి నిర్ణయించింది.

Samayam Telugu 25 Mar 2020, 6:44 pm
నిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నామని.. దీనికి ప్రజలంతా మద్దతుగా నిలిచి కరోనా వైరస్‌ నిరోధానికి కట్టుబడి ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ కోరారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని.. క్రమశిక్షణతో వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బుధవారం (మార్చి 25) మధ్యాహ్నం ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్‌ సమావేశమైంది. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ మాట్లాడారు. 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో పేదలకు ఇబ్బంది కలగుకుండా.. 2 రూపాయలకే కిలో గోధుమలు, 3 రూపాయలకు కిలో బియ్యం అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు.
Samayam Telugu mumbai


క‌రోనా నివార‌ణ‌కు సోష‌ల్ డిస్టాన్సింగే ఏకైక మార్గమని తెలిపారు. అయితే.. ప్రజలందరికీ అన్ని సౌక‌ర్యాలు అందుబాటులో ఉంటాయ‌ని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో దేశంలోని 80 కోట్ల మంది ప్రజల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. పాలు, నిత్యావసర సరకులకు సంబంధించిన షాపులు నిర్ణీత సమయం వరకు తెరిచే ఉంటాయని జవదేకర్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని సూచించారు.

ఒప్పంద ఉద్యోగులతో పాటు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని ఆదేశించామని ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వాలు చేస్తున్న సూచనలను అందరూ పాటించాలని కోరారు. కరోనా వైరస్‌ ప్రభావాన్ని నిరోధించేందుకే కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకుందని.. ఇది తప్పసరి చర్య అని వివరించారు. ప్రజల రక్షణ కోసం తీసుకున్న నిర్ణయానికి అందరూ మద్దతు తెలపాలని కోరారు. వైద్యులు, జర్నలిస్టులు, మీడియా సిబ్బంది ఇతోధిక సేవ చేస్తున్నారని జవదేకర్‌ ప్రశంసించారు.

Also Read: సామాజిక దూరం: స్వయంగా పాటించిన మోదీ.. కేబినెట్ మీట్ ఫోటో వైరల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.