భారత ప్రధానిగా స్వీడన్లో తొలిసారి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని నరేంద్ర మోదీ అన్నారు. మూడు ఐరోపా దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ స్వీడన్కు చేరుకున్నారు. అక్కడ ప్రధానికి ఘన స్వాగతం లభించింది. స్టాక్హోమ్కు చేరుకున్న మోదీకి స్వీడన్ ప్రధాని స్టెఫాన్ లొఫ్నెస్ స్వయంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు ప్రధానులు పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత పలువురు వ్యాపార దిగ్గజాలతో మోదీ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్లో స్వీడన్ ప్రధాన పాత్ర పోషించడం గురించి ప్రస్తావించారు. ఆ దేశంపై ప్రశంసల వర్షం కురిపించారు. స్వీడిష్ గడ్డపై భారత ప్రధాని అడుగుపెట్టడం 30 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ నేపథ్యంలో మోదీ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.
మోదీ బస చేసిన హోటల్ వద్దకు ప్రవాస భారతీయులు భారీ ఎత్తున చేరుకున్నారు. మోదీతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. స్వీడన్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ.. జర్మనీ, బ్రిటన్లో పర్యటిస్తారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్లో స్వీడన్ ప్రధాన పాత్ర పోషించడం గురించి ప్రస్తావించారు. ఆ దేశంపై ప్రశంసల వర్షం కురిపించారు. స్వీడిష్ గడ్డపై భారత ప్రధాని అడుగుపెట్టడం 30 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ నేపథ్యంలో మోదీ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.
మోదీ బస చేసిన హోటల్ వద్దకు ప్రవాస భారతీయులు భారీ ఎత్తున చేరుకున్నారు. మోదీతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. స్వీడన్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ.. జర్మనీ, బ్రిటన్లో పర్యటిస్తారు.