యాప్నగరం

అతి పొడవైన బ్రిడ్జికి మోదీ పెట్టిన పేరు ఇది!

అసోంలో ప్రారంభించిన అతి పొడవైన వారధి ధోలా-సదియాకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘భూపేన్ హజారికా’

Samayam Telugu 26 May 2017, 2:10 pm
అసోంలో ప్రారంభించిన అతి పొడవైన వారధి ధోలా-సదియాకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘భూపేన్ హజారికా’ అని నామకరణం చేశారు. అసోంలోని బ్రహ్మపుత్ర ఉపనది లోహిత నదిపై నిర్మించిన 9.15 కిలోమీటర్ల బ్రిడ్జిని మోదీ శుక్రవారం జాతికి అంకితం చేశారు. అసోంలోసి ధోలా అరుణాల్ చల్ ప్రదేశ్ లోని సధియాలను ఈ బ్రిడ్జి కలుపుతుంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం మూడేళ్లు, అసోంలో బీజేపీ ప్రభుత్వం యేడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మోదీ ఇక్కడ పర్యటిస్తున్నారు.
Samayam Telugu modi names bhupen hazarika bridge for dhola sadiya bridge in assam
అతి పొడవైన బ్రిడ్జికి మోదీ పెట్టిన పేరు ఇది!


ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘దేశంలోనే అతి పొడవైన వంతెన నిర్మాణం పూర్తయింది. ఈ వారధికి భూపేన్‌ హజారికా అని పేరు పెడుతున్నాం. ఈ వంతెన యావత్‌ భారతానికి గర్వకారణం. అసోం, అరుణాచల్‌ ప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధిలో ఈ బ్రిడ్జి కీలక పాత్ర పోషిస్తుంది. దీని వల్ల దూరం తగ్గుతుంది. నాలుగు గంటల సమయం ఆదా అవుతుంది. ఇంధన ఖర్చు కూడా తగ్గుతుంది. రోజుకు రూ. 10లక్షలు ఆదా అవుతుంది’ అని పేర్కొన్నారు.

ఈ బ్రిడ్జి కోసం 50ఏళ్లుగా ప్రజలు ఎదురుచూశారని, కాంగ్రెస్ పాలన వల్లే దీని నిర్మాణం అయ్యిందని విమర్శించారు. 2004లో వాజ్ పేయ్ ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నికొని ఉండిఉంటే పదేళ్ల క్రితమే బ్రిడ్జి నిర్మాణం జరిగి ఉండేదన్నారు. బ్రిడ్జి ప్రారంభంతో వాజ్ పేయ్ కల సాకారం చేశామని చెప్పారు.

అసోంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఎన్నో సమస్యలను పరిష్కారించామని మోదీ తెలిపారు.

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మోదీ పునరుద్ఘాటించారు. ఈశాన్య రాష్ట్రాలు పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని, అయితే రవాణా మార్గాలే ఇక్కడ సమస్యని తెలిపారు. త్వరలోనే రవాణా సమస్యని పరిష్కరిస్తామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.