యాప్నగరం

ప్రధాని చొరవతో నిలిచిన పసికందు ప్రాణాలు!

ప్రధాని నరేంద్రమోదీ చొరవతో ఓ పసికందు ప్రాణాలు నిలిచాయి. ఎనిమిది రోజుల కిందట అసోంలో జన్మించిన ఆ పసికందు పుట్టుకతోనే మెకోనియం యాస్పిరేషన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు.

TNN 7 Mar 2017, 12:13 am
ప్రధాని నరేంద్రమోదీ చొరవతో ఓ పసికందు ప్రాణాలు నిలిచాయి. ఎనిమిది రోజుల కిందట అసోంలో జన్మించిన ఆ పసికందు పుట్టుకతోనే మెకోనియం యాస్పిరేషన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఆ నవజాత శిశువు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో దిబ్రూఘర్‌ నుంచి ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా దిల్లీలోని గంగారామ్‌ ఆస్పత్రికి తరలించి సరైన సమయంలో చికిత్స అందించడంతో ఆ చిన్నారికి ప్రాణాపాయం తప్పింది.
Samayam Telugu modi plays the hero after critically ill eight day old girl saved
ప్రధాని చొరవతో నిలిచిన పసికందు ప్రాణాలు!


వారం కిందట అసోంలో జన్మించిన ఆ చిన్నారికి అవసరమైన అత్యాధునిక వైద్య సదుపాయాలు లేకపోవడంతో దిల్లీకి తరలించాల్సిందేనని వైద్యులు తెలిపారు. దీంతో దిబ్రూఘర్‌లోని ఆదిత్య హాస్పిటల్ నుంచి వైద్యులు విమానం ద్వారా పసికందును దిల్లీకి తరలించారు. ఆ విమానం దిల్లీకి రాత్రి 7గంటలకు చేరుకుంది. ఆ సమయంలో దిల్లీలో రోడ్లపై విపరీతమైన ట్రాఫిక్‌ ఉంటుంది.

ఈ విషయం గురించి తెలుసుకున్న ప్రధాని పాపను ఆస్పత్రికి తరలించే దారిలో ట్రాఫిక్‌ జాం కాకుండా చూడాలని దిల్లీ ట్రాఫిక్‌ పోలీసులకు ఆదేశించారు. దీంతో విమానం దిగిన వెంటనే దిల్లీ పోలీసులు, అధికారులు హుటాహుటిన చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తమ బిడ్డ ప్రాణాలు కాపాడిని ప్రధాని మోదీకి ఆ నవజాత శిశువు తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. అంతే కాదు తమ పాలిట దేవుడిగా ప్రధానిని అభివర్ణించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.