యాప్నగరం

2022 కల్లా అందరికీ ఇళ్లు : నరేంద్ర మోదీ

2022 కల్లా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం అంబేద్కర్

Samayam Telugu 14 Apr 2017, 4:04 pm
2022 కల్లా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా పలు అభివృద్ధి పథకాలను ఆయన ప్రారంభించారు.
Samayam Telugu modi says every indian should have a house by 2022
2022 కల్లా అందరికీ ఇళ్లు : నరేంద్ర మోదీ


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘పేదల్లో నిరుపేదలు అందరూ 2022కల్లా సొంత ఇల్లు కలిగి ఉండాలి. ఆ ఇల్లు అన్ని వసతులతో ఉండాలి. నీళ్లు, కరెంటు, ఇతర సదుపాయాలు ఉండాలి. ప్రతి గ్రామానికి చేరువలో ఆసుపత్రితో పాటు పాఠశాల కూడా ఉండాలి’’ అని అన్నారు.

వచ్చే ఐదేళ్లలో పేదరిక నిర్మూలనకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పథకాలు రూపొందిస్తోందని తెలిపారు.

మోదీ నాగ్ పూర్, ముంబైలలో శుక్రవారం బిజీబిజీ గడిపారు. ఉదయం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన 1956 అక్టోబర్ 14న దాదాపు ఆరు లక్షల మంది దళితులతో బౌద్ధం స్వీకరించిన ‘ధీక్షభూమి’ని మోదీ సందర్శించి నివాళులు అర్పించారు. దీంతో పాటు అంబేద్కర్ సమాధి ‘చైత్య భూమి’ని కూడా సందర్శించి మోదీ, ఇతర కేంద్రమంత్రులు నివాళులు అర్పించారు.

భీమ్-ఆధార్ యాప్ ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.