యాప్నగరం

మావోయిస్టులు పిరికి వాళ్లు: పీఎం మోదీ

చత్తీస్ ఘడ్ లోని సుకుమాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు జరిపిన దాడి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్ర్భాంతి

Samayam Telugu 24 Apr 2017, 7:29 pm
చత్తీస్ ఘడ్ లోని సుకుమాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు జరిపిన దాడి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మావోయిస్టులది పిరికిపందల చర్యగా ఆయన అభివర్ణించారు. సీఆర్పీఎఫ్ జవాన్ల త్యాగం వృథా కానిన్వబోమని చెప్పిన ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Samayam Telugu modi shocks over maoists attack in sukma in chattisghar
మావోయిస్టులు పిరికి వాళ్లు: పీఎం మోదీ


అటు జవాన్ల దాడి విషయం తెలియగానే కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చత్తీస్ ఘడ్ సీఎం రమణ్ సింగ్ తో ఫోన్లో మాట్లాడారు. కేంద్రహోం సహాయ మంత్రి హన్స్ రాజ్ ను చత్తీస్ ఘడ్ వెళ్ళి పరిస్థితి సమీక్షించాలని ఆదేశించారు. మావోయిస్టుల దాడిలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు సానూభూతి తెలియజేశారు.
ఈ దాడిని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తీవ్రంగా ఖండించారు. జవాన్లపై మావోయిస్టుల దాడి మతిలేని చర్య అని వెంకయ్య మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.