యాప్నగరం

మళ్లీ మోదీకే పీఎం పీఠం, తాజా సర్వే వెల్లడి

పెద్ద నోట్ల రద్దుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్ మరింత పెరిగింది. ఆ

Samayam Telugu 27 Jan 2017, 9:52 am
పెద్ద నోట్ల రద్దుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్ మరింత పెరిగింది. ఆ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఆయనకు ఆదరణ మరింత పెరిగిందని ఓ సర్వేలో వెల్లడయింది. ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలు నిర్వహిస్తే ఆయన నాయకత్వంలోని ఎన్‌డీఏకు 360 స్థానాలు ఖాయమని, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ 60 స్థానాలకే పరిమితమవుతుందని తేలింది.
Samayam Telugu modi team wins 360 ls seats while he is gained peoples heart says survey
మళ్లీ మోదీకే పీఎం పీఠం, తాజా సర్వే వెల్లడి


రద్దయిన పెద్ద నోట్లను జమ చేసేందుకు చివరి గడువైన గత ఏడాది డిసెంబరు 30 నుంచి ఈ ఏడాది జనవరి 9 వరకు దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ పేరుతో ఇండియా టుడే-కార్వీ విస్తృత సర్వే నిర్వహించింది.

ఈ సర్వేలో..ఎన్‌డీఏకు 42శాతం వరకు ఓట్లు వస్తాయి. ఈ ఓట్లతో 360 లోక్ సభ స్థానాలు దక్కుతాయని తేలింది. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏకు లభించే ఓట్లు 25శాతం మాత్రమేనని ఇతరులకు లభించే ఓట్లు 33శాతమని సర్వే వెల్లడించింది.

అటు ప్రధానమంత్రి పదవికి ఉత్తమ అభ్యర్థిగా మోదీ అందరికన్నా ముందంజలో ఉన్నారు. ఈ సర్వేలో ఆయనకు 65శాతం ఓట్లు లభించాయి. పెద్ద నోట్ల రద్దుకు ముందు ఆగస్టులో నిర్వహించిన సర్వేలో ఎన్‌డీఏకు వచ్చే ఓట్లు 40శాతం రాగా... పెద్ద నోట్ల రద్దు తర్వాత 42శాతం ఓట్ల శాతం పెరగడం విశేషం. దీంతో మోదీకున్న ఆదరణ పెరిగిందని తెలుస్తోందని సర్వే సంస్థ వెల్లడించింది.

అటు ఎన్నికలు జరుగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, గోవాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడేందుకే ఎక్కువ అవకాశాలున్నాయని ది వీక్‌-హంస నిర్వహించిన సర్వేలో వెల్లడయింది. ఉత్తర్‌ప్రదేశ్‌, గోవాలో బీజేపీ ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వే వెల్లడించింది. పంజాబ్‌లో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించనుంది. ఉత్తరాఖండ్‌ బీజేపీ ఖాతాలో చేరనుందని సర్వే పేర్కొంది.

ఈ సర్వే ప్రకారం ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీకి లభించే సీట్లు 192-196. సమాజ్‌వాదీపార్టీ-కాంగ్రెస్‌ కూటమికి లభించే స్థానాలు 178-182. బహుజన్‌ సమాజ్‌ పార్టీ స్థానాలు 20-24కు పడిపోనున్నాయి.

-పంజాబ్‌లో మొత్తం 117 స్థానాలకుగాను కాంగ్రెస్‌కు 49-51 స్థానాలు రావచ్చని ది వీక్‌-హంస సర్వే అంచనా. ఆమ్‌ఆద్మీ పార్టీ 33-35 స్థానాలతో సరిపెట్టుకుంటుంది. అకాలీదళ్‌-బీజేపీ కూటమికి 28-39 స్థానాలు అని సర్వేలో తేలింది.
-ఉత్తరాఖండ్‌లో మొత్తం 70 స్థానాలకు బీజేపీ ఖాతాలో మెజార్టీ స్థానాలు 37-39 గెల్చుకోగలదని అంచనా. అధికార కాంగ్రెస్‌ 27-29 స్థానాలకే పరిమితం అయ్యే అవకాశం ఉందని సర్వే తెలిపింది.


-గోవాలో మొత్తం 40 స్థానాలకు అధికార బీజేపీ 17-19 కాంగ్రెస్‌కు 11-13, ఆమ్‌ఆద్మీ పార్టీ 2-4, మహారాష్ట్ర గోమంతక్‌ పార్టీ నేతృత్వంలోని కూటమికి 3-5స్థానాలు దక్కవచ్చవని అంచనా.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.