యాప్నగరం

సంగీతంతో ప్రాణాలు కాపాడుతున్నారు.. హ్యాట్సాఫ్!

Brain Death: మరణం అంచుల్లో ఉన్నవారికి మరో జీవితం ప్రసాదించే మహా కార్యం అవయవదానం. మరణం తర్వాత కూడా జీవించి ఉండగలిగే మహద్భాగ్యం. ఆ పవిత్ర కార్యానికి ఆన్‌లైన్ కచేరీల ద్వారా తోడ్పాడు అందిస్తున్నారు ఈ సంగీతకారులు..

Samayam Telugu 27 Nov 2020, 7:22 pm
కొంత మంది తాము చనిపోతూ ఎంతో మంది ప్రాణాలను కాపాడతారు. ఇతరుల ప్రాణాలను కాపాడటానికే అలాంటి వారు పుడతారేమో.. అవయవ దానంతో ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. అది సకాలంలో చేయడం వల్ల ఏటా లక్షల మంది ప్రాణాలను కాపాడవచ్చు. అందుకే ఇప్పుడు నినాదం మారింది. ‘అన్ని దానాల కంటే గొప్ప దానం అవయవ దానం’ కొత్త నినాదంగా అవతరించింది. మోహన్ (MOHAN) ఫౌండేషన్ (మల్టీ ఆర్గాన్ హార్వెస్టింగ్ ఏయిడ్ నెట్‌వర్క్) దీన్ని బలంగా నమ్ముతుంది. అవయవ దానం (Organ Donation)పై అవగాహన పెంచడానికి, అందుకు అవసరమైన సదుపాయాలను కల్పించడానికి విశేష కృషి చేస్తోంది.
Samayam Telugu అవయవదానంపై సంగీత కచేరీలు
Organ Donation


ఒక్క 2019 సంవత్సరలోనే ఈ ఫౌండేషన్ 3,200కు పైగా అవయవ మరియు టిష్యూ మార్పిడిని సాధ్యం చేసింది. ఇది అంత తేలికైన విషయం కాదు. అవయవ దానం ప్రాముఖ్యం గురించి అవగాహన పెంచడానికి మోహన్ సంస్థ ‘మిషన్ టు రీచ్ మిలియన్స్’ అనే వినూత్న కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా లక్షల మందికి అవయయ దానం గురించి తెలియజేయాలనేది వారి లక్ష్యం.

అవయవదానంపై అవగాహన పెంచే కార్యక్రమాల్లో భాగంగా MOHAN ఫౌండేషన్.. ఆన్‌లైన్ ద్వారా కచేరీలు నిర్వహిస్తోంది. ఇందులో సుప్రసిద్ధ గాయకులు, సంగీతకారులు పాల్గొంటున్నారు. అవయవదానం గురించి అవగాహన పెంచడానికి తమ వంతు సహకారం అందిస్తున్నారు. అంతేకాకుండా ఇందుకు అవసరమైన సదుపాయాలు కూడా సమకూర్చడం విశేషం.

ఈ ఏడాది జులై 18న నిర్వహించిన ‘సింగింగ్ ఫర్ పోసిటివిటీ’ కార్యక్రమంలో సింగర్ ఐశ్వర్య శ్రీనివాస్ పాల్గొన్నారు. తన కచేరి ద్వారా కర్ణాటక సంగీతంలో హేమాహేమీలైన మహిళా సంగీత కారులు ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, డి.కె. పట్టమల్, ఎం.ఎల్. వసంత కుమారి గార్లకు ఘనంగా నివాళి అర్పించారు. అంతకుముందు జులై 4న నిర్వహించిన ఆన్‌లైన్ కచేరిలో శంకర్ మహాదేవన్ అకాడెమీలోని అధ్యాపకులతో ‘బైఠక్ టు బాలీవుడ్’ నిర్వహించారు.

మొదటి ఆన్‌లైన్ కచేరీని మే నెలలో విజయవంతంగా నిర్వహించారు. ‘సింగింగ్ ఫర్ హోప్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గాయకులు ఎస్. ఐశ్వర్య, ఎస్. సౌందర్య పాల్పంచుకున్నారు. ‘సింగింగ్ ఫర్ జాయ్’ పేరుతో రెండో కచేరీ జూన్ 6న జరిగింది. ఇందులో పద్మశ్రీ ఉషా ఉతుప్ పాల్గొని కార్యక్రమానికి మరింత ఉత్సాహం తీసుకొచ్చారు.

అవయవదానం గురించి అవగాహన పెంచి, నిధులు సేకరించడానికి MOHAN ఫౌండేషన్.. మిలాప్ వెబ్‌సైట్‌తో ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ మెదలుపెట్టింది. ఈ క్యాంపెయిన్ ద్వారా ఇప్పటికే సుమారు 500 మంది దాతలు రూ.10 లక్షలకు పైగా విరాళాలను సమకూర్చారు.

బ్రెయిన్ డెత్ (Brain Dead) అయిన వ్యక్తి శరీర అవయవాలతో 8 మందికి ప్రాణం పోయొచ్చు. అవి:
* కాలేయం (1)
* ఊపిరితిత్తులు (2)
*మూత్రపిండాలు (2)
* గుండె (1)
* పాంక్రియాస్ (1)
* చిన్న పేగు (1)

వీటితో పాటు చర్మం, కార్నియా, ఎముక కణజాలం, గుండె కవాటాలు, రక్త నాళాలను అవసరమైన రోగులకు మార్పిడి చేయవచ్చు.

ఏ అవయవాలను దానం చేయొచ్చు? ఎంత సమయంలో చేయాలి?
✧ దాత శరీరం నుంచి గుండెను బయటకు తీసిన తర్వాత దాన్ని 4 గంటల్లోగా అవసరమైన వారికి అమర్చాలి. ఊపిరితిత్తులు కూడా అంతే.
✧ మూత్రపిండాలను 30 గంటల్లోగా మార్పిడి చేయొచ్చు.
✧ కాలేయం, పాంక్రియాస్‌ 12 గంటల్లోగా మార్పిడి చేయాలి.
✧ ప్రమాదం కారణంగా లేదా ఇన్ఫెక్షన్ కారణంగా కంటి చూపు కోల్పోయిన వారికి కార్నియాను రీప్లేస్ చేయడం ద్వారా తిరిగి చూపు ప్రసాదించవచ్చు.
✧ కాలిన గాయాల బాధితులకు చర్మం మార్పిడి చేస్తారు.
✧ గుండె బైపాస్ సర్జరీ చేయించుకునే వారికి దాతల నరాలను ఉపయోగిస్తారు.

అతి సామాన్యుడు సైతం మానవత్వంతో చేసే వెలకట్టలేని కార్యం అవయవదానం. మరణం అంచుల్లో ఉన్నవారికి మరో జీవితం ప్రసాదించే మహా కార్యం. ఆ మాటకొస్తే.. మరణం తర్వాత కూడా జీవించి ఉండగలిగే మహద్భాగ్యం. అలాంటి పవిత్ర కార్యంలో అందరూ పాల్పంచుకోవాల్సిందే..!

ఈ క్యాంపెయిన్ గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి, సాయం చేయడానికి..
వెబ్‌సైట్: https://milaap.org

Also Read: అమ్మాయిల పెళ్లి వయసు పెంపు.. త్వరలోనే నిర్ణయం

Must Read: ఎంత ఘోరం.. బతికుండగానే ఫ్రీజర్‌లో పెట్టారు, ఊపిరాడక మృతి
Don't Miss: రిసెప్షనిస్ట్ అనుకున్నాడు, కానీ ఆమె హైరింగ్ మేనేజర్.. 5 నిమిషాల్లో ఉద్యోగం ఫట్!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.