యాప్నగరం

అండమాన్ నికోబార్ దీవులని తాకిన రుతుపవనాలు

ఇంకా ఎన్నిరోజులు ఈ ఎండ వేడిమి భరించాలా అని రుతు పవనాల కోసం ఎదురుచూస్తున్న జనానికి, మళ్లీ పంటలు...

TNN 14 May 2017, 10:54 pm
ఇంకా ఎన్నిరోజులు ఈ ఎండ వేడిమి భరించాలా అని రుతు పవనాల కోసం ఎదురుచూస్తున్న జనానికి, మళ్లీ పంటలు పండించడానికి ఆకాశం వైపు చూసే రైతన్నలకి భారత వాతావరణ శాఖ ఓ తీపి కబురు వినిపించింది. సాధారణంగా ప్రతీ సంవత్సరం మే 20వ తేదీ తర్వాతే రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించడం జరుగుతుంది. కానీ ఈసారి ఎప్పటికన్నా ఆరు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు అండమాన్‌ దీవులని తాకాయి.
Samayam Telugu monsoon rains reached the andaman and nicobar islands
అండమాన్ నికోబార్ దీవులని తాకిన రుతుపవనాలు


ఈ రుతుపవనాలు రానున్న 72 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 48 గంటల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు వున్నాయని ప్రకటించిన వాతావరణ శాఖ.. రానున్న మూడు రోజుల్లో ఎండ తీవ్రత మాత్రం మరింత పెరిగే అవకాశం లేకపోలేదని ఈ ప్రకటనలో పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.