యాప్నగరం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం

పార్లమెంట్ వర్షాకాల సమావేవాలు ప్రారంభమయ్యాయి. ఓవైపు పార్లమెంటు భవనంలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరుగుతుండగానే ఉభయ సభలు ప్రారంభమయ్యాయి.

TNN 17 Jul 2017, 11:26 am
పార్లమెంట్ వర్షాకాల సమావేవాలు ప్రారంభమయ్యాయి. ఓవైపు పార్లమెంటు భవనంలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరుగుతుండగానే ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. తొలి రోజు లోక్‌సభలో ఫరూక్ అబ్దుల్లా, పీకే కున్హాలి కుట్టి ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఇటీవల మరణించిన సభ్యులకు ఉభయసభలు సంతాపం తెలియజేశాయి. అనంతరం ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి.
Samayam Telugu monsoon session of parliament begins
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం


ఈ వర్షాకాల సమావేశాల్లో గో రక్షణ పేరిట జరుగుతున్న దాడులు, కశ్మీర్‌లో అల్లర్లు, భారత్-చైనా మధ్య డోక్లమ్ వివాదంపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. ఇక వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)తో కలుగుతున్న ఇబ్బందులు, రైతుల దుస్థితి, పాకిస్థాన్‌ విషయంలో భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం అంశాలను ప్రధానంగా చర్చకు తీసుకొచ్చేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. కాగా, విపక్షాల సహకారంతో సుమారు 24 బిల్లులను ఆమోదించాలని మోదీ ప్రభుత్వం చూస్తోంది. ఈ వర్షాకాల సమావేశాన్ని 20 సిట్టింగులపాటు జరపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.