యాప్నగరం

మొతెరాకు మోదీ పేరు.. ఇది సర్దార్‌జీకి అవమానం కాదా, పటేల్ ఫైర్

Narendra Modi Stadium: అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియం పేరు మార్పుపై కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్ మండిపడ్డారు. ఇది సర్దార్ పటేల్‌ను అవమానించడమేనని ట్వీట్ చేశారు.

Samayam Telugu 24 Feb 2021, 4:30 pm
మొతెరా క్రికెట్ స్టేడియం పేరు మార్పు చర్చనీయాంశంగా మారింది. అహ్మదాబాద్‌లోని ఈ స్టేడియాన్ని ఆధునికీకరించారు. స్టేడియం కెపాసిటీని పెంచారు. 1,10,000 వీక్షకుల కెపాసిటీతో ప్రపంచంలోనే అతిపెద్ద మైదానంగా మొతెరా నిలిచింది. భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు నేపథ్యంలో ఈ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం (ఫిబ్రవరి 24) ప్రారంభించారు.
Samayam Telugu మొతెరా స్టేడియం
Motera Cricket Stadium


మొతెరా క్రికెట్ స్టేడియాన్ని ఇప్పటివరకు సర్దార్ పటేల్ స్టేడియంగా పిలిచేవారు. అయితే.. ఆధునికీకరించిన తర్వాత దీనికి నరేంద్ర మోదీ మైదానంగా పేరు పెట్టారు. కొంత మంది దీన్ని తప్పుబడుతున్నారు. ఇది సర్దార్ పటేల్‌ను అవమానించడమేనని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్ ఈ అంశంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘సర్దార్ పటేల్‌పై ఈగ వాలనివ్వని బీజేపీ ఇప్పుడు సర్దార్జీని అవమానిస్తోంది. సర్దార్ పటేల్ పేరుతో ఉన్న క్రికెట్ మైదానం పేరును నరేంద్ర మోదీ మైదానంగా మార్చారు. ఇది సర్దార్ పటేల్‌కు అవమానం కాదా? సర్దార్‌జీని అగౌరవపరిచే చర్యలను గుజరాత్ ప్రజలు ఎంతమాత్రం సహించరు’ అని హార్దిక్ పటేల్ ట్వీట్ చేశారు.

భారతరత్న, లోక పురుషుడు సర్దార్ పటేల్.. దేశంలోని ప్రతి పౌరుడి జీవితంపై ప్రభావం చూపారు. ఆయనకు అవమానం తెచ్చే ఎలాంటి చర్యనూ హిందుస్థాన్ సహించదు అంటూ హార్దిక్ పటేల్ మరో ట్వీట్ చేశారు.


Also Read:

భారత్‌లో రెండు కొత్త కరోనా వేరియంట్ల గుర్తింపు..

ఇంకా దొరకని 136 మంది ఆచూకీ.. ఇక మరణించినట్టే!

గుజరాత్‌‌లో ఆప్‌ పాగా.. కేజ్రీవాల్‌కు కొత్త జోష్, ఎంఐఎం తొలిసారిగా

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.