యాప్నగరం

పాలు అడిగిందని కన్న బిడ్డను చంపేసింది

ఈ సృష్టిలో ఎవరి ప్రేమ గొప్పదంటే... జన్మనిచ్చిన తల్లిదే. బిడ్డకు ఏ కష్టమొచ్చినా... అమ్మ తల్లడిల్లిపోతుంది. కాని ఓ తల్లి మాత్రం కన్నబిడ్డపాలిట రాక్షసిగా మారింది. చిన్న కారణంతోనే గొంతు నులిమి చంపేసింది. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో జరిగిన ఘటన సంచలనంగా మారింది.

TNN 9 Feb 2018, 11:29 am
ఈ సృష్టిలో ఎవరి ప్రేమ గొప్పదంటే... జన్మనిచ్చిన తల్లిదే. బిడ్డకు ఏ కష్టమొచ్చినా... అమ్మ తల్లడిల్లిపోతుంది. కాని ఓ తల్లి మాత్రం కన్నబిడ్డపాలిట రాక్షసిగా మారింది. చిన్న కారణంతోనే కిరాతకంగా చంపేసింది. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో జరిగిన ఘటన సంచలనంగా మారింది. ఏడాది వయసున్న చిన్నారి తల్లి పాల కోసం గుక్కపట్టి ఏడ్చింది. పాలు ఇచ్చి కొద్దిసేపు కూడా కాలేదని... ఆమెకు కోపం వచ్చింది. ఆగ్రహంతో ఊగిపోయిన అనిత... బిడ్డను ఇష్టం వచ్చినట్లు కొట్టింది. అప్పటికి ఏడుపు ఆపకపోవడంతో... గొంతు కోసి హత్య చేసింది.
Samayam Telugu mother killed one year old daughter in madhyapradesh
పాలు అడిగిందని కన్న బిడ్డను చంపేసింది


ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడింది. ఇంటికి తాళం వేసి ఏమీ తెలియనట్లు వెళ్లిపోయింది. అయితే చేసిన పాపం ఎక్కడికిపోతుంది. ఇరుగుపొరుగు వారికి అనితపై అనుమానం రావడంతో... తాళం పగులగొట్టి చూడటంతో ఈ దారుణం బయటపడింది. రెండు రోజుల తర్వాత బయటపడింది. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. కోర్టు ఆమెను రిమాండ్‌కు పంపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.