యాప్నగరం

అమ్మ చివరి మాట.. కోట్ల రూపాయల ఆస్తులు వదులుకున్న బిడ్డలు

Odisha woman last wish: అమ్మ చివరి కోరిక తీర్చడానికి ముగ్గురు కుమార్తెలు ఒకే మాట మీద నిలబడ్డారు. కోటి రూాపాయలకు పైగా ఆస్తిని విరాళంగా ఇచ్చేశారు. తల్లి ఆభరణాల పైనా ఆశపడలేదు. ఒడిశాలోని నవరంగ్‌పూర్ జిల్లాలో చోటు చేసుకున్న ఘటన వివరాలు..

Samayam Telugu 24 Dec 2020, 5:31 pm
డిశాలోని నవరంగ్‌పూర్ జిల్లా నవరంగౌర్‌కు చెందిన ఓ మహిళ డిసెంబర్ 2న అనారోగ్యంతో మరణించింది. ఆమెకు కుమారులు లేరు. ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారందరికీ పెళ్లిళ్లు జరిపించి కాపురాలకు పంపించింది. ఆమె భర్త అనారోగ్యంతో మంచం పట్టాడు. నవరంగౌర్ పట్టణంలో ఆమెకు మూడంతస్తుల భవంతి ఉంది. దాని విలువ కోటి రూపాయలకు పైనే ఉంటుంది. 25 గదులున్న ఆ బిల్డింగ్‌లో ప్రస్తుతం 10 కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. అద్దె రూపంలో నెలకు వేలాది రూపాయల ఆదాయం వస్తోంది.
Samayam Telugu ముగ్గురు అక్కాచెల్లెళ్లు
Odisha sisters - Mother last wish


ఆ ఆస్తినంతా ఆమె కుమార్తెలు విరాళంగా ఇచ్చేశారు. తమ తల్లి చివరి కోరిక అదేనట. పట్టణంలోని జగన్నాథ ఆలయానికి తన ఆస్తినంతా విరాళంగా ఇచ్చేయాలని ఆ తల్లి కోరిందట. ఆమె మరణించిన 14వ రోజున ముగ్గురు కుమార్తెలు వచ్చి తమ తల్లి చివరి కోరిక నెరవేర్చారు. ఆలయ నిర్వాహకులను కలిసి ఆస్తికి సంబంధించిన పత్రాలను అందజేశారు. గదుల ద్వారా వస్తున్న అద్దె రుసుమును కూడా వారినే వసూలు చేసుకోవాల్సిందిగా కోరారు.

ఆస్తుల కోసం కొంత మంది కన్న తల్లిదండ్రులతో, సోదరులతో గొడవలు, ఘర్షణలకు దిగుతున్న నేటి సమాజంలో తల్లి చివరి కోరిక కోసం ఒకే మాటపై నిలబడిన ఆ అక్కాచెల్లెళ్లపై అభినందనల వర్షం కురుస్తోంది. ఆ ఆడపడచుల పేర్లు.. పుష్పాంజలి, గీతాంజలి, శ్రద్ధాంజలి. ఎంత అందమైన పేర్లు పెట్టుకుందో ఆ తల్లి. ఇలాంటి ఉత్తములను కన్న ఆ తల్లి పేరు వైజయంతీమాల..

వైజయంతీమాల ఇళ్లు


ఆ జగన్నాథుడినే కొడుకుగా భావించి..
కుమారులు లేని వైజయంతీమాల ఆ జగన్నాథుడినే తన కొడుకుగా భావించారట. అందుకే తన ఆస్తి యావత్తూ ఆయన పాదాల చెంతకే చేర్చారు. ఆమె ఆస్తులపైనే కాదు, ఆభరణాలపైనా ఆ బిడ్డలు ఆసక్తి చూపలేదు. తల్లి పెళ్లినాటి నెక్లెస్, ఇతర బంగారు, వెండి ఆభరణాలన్నింటినీ స్థానికంగా ఉన్న పార్వతీ మాత ఆలయానికి విరాళంగా ఇచ్చేశారు.

నవరంగౌర్ పట్టణంలోని జగన్నాథ ఆలయం 3 శతాబ్దాల కింద నిర్మించినదని ఆలయ నిర్వాహకులు తెలిపారు. శిథిలావస్థకు చేరిన ఆ ఆలయ స్థానంలో కొత్త ఆలయాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు. వైజయంతీమాల సమర్పించిన విరాళాలు అందుకు చక్కగా ఉపయోగపడతాయని హర్షం వ్యక్తం చేశారు. అద్దె ద్వారా వచ్చే రుసుం ఆలయ నిర్వహణకు శాశ్వతంగా ఉపయోగపడే అవకాశం ఉందని తెలిపారు.

ఆలయం


Must Read:

కరోనా ఫోబియా: పడక గదికి రాని కొత్త పెళ్లికొడుకు.. భార్య షాకింగ్ ట్విస్ట్!

భారత స్కూల్ టీచర్‌కు 7 కోట్ల ప్రైజ్.. సూపర్ టాలెంట్, మంచి మనసు

కర్నూల్: వాటర్ హీటర్ ఎంత పని చేసింది.. తల్లీ, ఇద్దరు బిడ్డల మృతి

పెళ్లిరోజే అమ్మాయి కాళ్లు పోయాయి.. అండగా ఉంటానని తిలకం దిద్దిన వరుడు, అందమైన జంట!

వీడియో: ఘోర యాక్సిడెంట్.. ఈ చిన్నారులను దేవుడే కాపాడాడు!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.