యాప్నగరం

గుండెపోటుకు గురైన ఎంపీ అహ్మాద్ మృతి

మంగళవారం పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో గుండెపోటుకు గురైన ఇండియన్

Samayam Telugu 1 Feb 2017, 8:26 am
మంగళవారం పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో గుండెపోటుకు గురైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్‌) ఎంపీ ఇ. అహ్మద్‌(78) కన్నుమూశారు. దిల్లీలోని రామ్‌మనోహర్‌ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం తెల్లవారుజామున 2.15గంటలకు తుదిశ్వాస విడిచారు.
Samayam Telugu mp e ahamed dies after suffering cardiac arrest
గుండెపోటుకు గురైన ఎంపీ అహ్మాద్ మృతి


మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగం సమయంలో పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో వెనక వరుసలోని సీట్లో కూర్చున్న అహ్మద్‌ స్పృహ తప్పిపడిపోయారు. రాష్ట్రపతి వైద్య బృందంలోని వైద్యులు ఆయనకు అత్యవసర వైద్య సేవలు అందించి రామ్‌మనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

యూపీఏ అధికారంలో మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వంలో విదేశాంగ, రైల్వే శాఖల సహాయ మంత్రిగా అహ్మద్‌ పనిచేశారు. ప్రస్తుతం కేరళలోని మలప్పురం నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

నేడు ఆయన పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

అయితే ఎంపీ మరణంతో బుధవారం బడ్జెట్ ప్రవేశపెడ్తారా? లేక వాయిదా వేస్తారా అన్నది అనుమానంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.