యాప్నగరం

Rs 2000 ఒరిజినల్ నోట్లపై గాంధీ బొమ్మ లేదు

రూ.2వేల నోట్లపై గాంధీ బొమ్మ కనిపించడం లేదు.

TNN 5 Jan 2017, 9:03 am
రూ.2వేల నోట్లపై గాంధీ బొమ్మ కనిపించడం లేదు. మధ్యప్రదేశ్ లోని షూపూర్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రైతులు విత్ డ్రా చేసుకున్న నగదులో ఉన్న రూ.2వేల నోట్లపై గాంధీ బొమ్మ లేకపోవడం వారిని ఆందోళనకు గురి చేసింది. అయితే అవి దొంగనోట్లేమోననుకొని రైతులు బ్యాంకు అధికారులకు వాటిని తిరిగి ఇచ్చి వేశారు.
Samayam Telugu mp farmers get rs 2000 notes without gandhi image
Rs 2000 ఒరిజినల్ నోట్లపై గాంధీ బొమ్మ లేదు


కానీ, ఆ నోట్లు దొంగనోట్లు కావని, అవి ఒరిజినల్ అని...ప్రింటింగ్ లో దొర్లిన పొరపాటు వల్ల కొత్తగా విడుదలైన రూ.2000వేల నోట్లపై గాంధీ బొమ్మ అచ్చవలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో చాలా మంది ప్రజలు ఇలాంటినోట్లు విత్ డ్రా చేసుకున్నట్లు అధికారులు గుర్తు చేశారు.

1996 నుంచి ఆర్బీఐ కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీ బొమ్మలను ముద్రిస్తోంది.

మధ్యప్రదేశ్ లోని బ్యాంకు నోట్ ప్రెస్ దివాస్ లో రూ.2000వేల నోట్ల ప్రింటింగ్ లో కొన్ని పొరపాట్లు దొర్లాయని అందువల్ల గాంధీ బొమ్మ మిస్ అయ్యిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.