యాప్నగరం

కూలీల నుదుటిపై పిచ్చి రాతలు.. లేడీ పోలీసు అత్యుత్సాహం

Lockdown News Updates: ‘‘నేను లాక్ డౌన్ ఉల్లంఘించా. నా నుంచి అందరూ దూరంగా ఉండండి.’’ అని ఆ మహిళా పోలీసులు పెన్నుతో కూలీ తలపై రాసింది. ఈ ఘటన శనివారం రాత్రి జరగ్గా ఆదివారం నాడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Samayam Telugu 29 Mar 2020, 4:21 pm
క‌రోనా వైరస్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు దేశమంతా లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. అయినా, చోట్ల ప్రజలు లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీసు అత్యుత్సాహం ప్రదర్శించారు. మధ్యప్రదేశ్‌లోని ఛాత‌ర్‌పూర్‌ గోరిహ‌ర్ ప్రాంతంలో మ‌హిళా స‌బ్ ఇన్‌స్పెక్టర్ ఓ కూలీ నుదుటిపై పిచ్చి రాతలు రాసింది. అతను లాక్ డౌన్ ఉల్లంఘనకు పాల్పడినందుకు అతని తలపై ఇలా రాసింది.
Samayam Telugu fore


‘‘నేను లాక్ డౌన్ ఉల్లంఘించా. నా నుంచి అందరూ దూరంగా ఉండండి.’’ అని ఆ మహిళా పోలీసులు పెన్నుతో కూలీ తలపై రాసింది. ఈ ఘటన శనివారం రాత్రి జరగ్గా ఆదివారం నాడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. శనివారం ఉదయమంతా పని చేసుకొని రాత్రికి కూలీ ఇంటికి వెళ్తుండగా కూడళ్ల వద్ద కాపలా ఉన్న మహిళా కానిస్టేబుల్ అతణ్ని ఆపింది. ఈ సమయంలో ఎందుకు బయటికి వచ్చావని ప్రశ్నించింది. తాను హమాలీ పనికి వెళ్లి వస్తున్నానని చెప్పినా పోలీసులు వినలేదు.

Also Read: లాక్‌డౌన్ వల్ల ఏదైనా ఇబ్బందా? ఈ నెంబర్లకు ఫోన్ చేస్తే తక్షణ పరిష్కారం

వెంటనే తన వద్ద ఉన్న ఎరుపు రంగు మార్కర్ బయటకు తీసి, కూలీ ముఖంపై ‘‘నేను లాక్ డౌన్ ఉల్లంఘించా. నాకు అందరూ దూరంగా ఉండండి.’’ అని రాసింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో ఈ విషయం జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ.. ఆ మహిళా పోలీసులు చేసింది సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. ఆమెపై చట్ట ప్రకారమే తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కుమార్ సౌరవ్ వెల్లడించారు.

Also Read: నేను చనిపోలేదు, ఆ ఆంటీని వలవేసి పట్టుకోలేదు.. కరోనా సోకిన డీఎస్పీ కుమారుడి వీడియో వైరల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.