యాప్నగరం

ఆర్మీపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు

ఇండియన్ ఆర్మీపై శివసేన ఎంపీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జవాన్లపై పాక్ జరిపిన కాల్పులపై స్పందించిన సంజయ్ రౌత్... ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నారు. భారత్ మాత్రం ఆయుధాలను కేవలం ప్రదర్శన కోసమే ఉంచుతున్నారని... అప్పుడప్పుడు రాజ్‌పథ్‌లో బయటకు తీసుకొచ్చి అందరి ప్రశంసలు పొందేందుకు మాత్రం ఉపయోగిస్తున్నారని ఆరోపణలు చేశారు.

TNN 5 Feb 2018, 12:56 pm
ఇండియన్ ఆర్మీపై శివసేన ఎంపీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జవాన్లపై పాక్ జరిపిన కాల్పులపై స్పందించిన సంజయ్ రౌత్... ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నారు. రెండు దేశాల దగ్గర ఆయుధాలున్నాయని... అయితే పాక్ మాత్రం జవాన్లను మట్టు పెడుతోందన్నారు. భారత్ మాత్రం ఆయుధాలను కేవలం ప్రదర్శన కోసమే ఉంచుతున్నారని... అప్పుడప్పుడు రాజ్‌పథ్‌లో బయటకు తీసుకొచ్చి అందరి ప్రశంసలు పొందేందుకు మాత్రం ఉపయోగిస్తున్నారని ఆరోపణలు చేశారు. రిపబ్లిక్ డే వేడుకల్లో విదేశాల నుంచి వచ్చిన వారికి ఆర్మీ ఆయుధాలను ప్రదర్శించేందుకే కదా అని ప్రశ్నించారు.
Samayam Telugu mp sanjay raut comments on army
ఆర్మీపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు


పాక్ ఆర్మీపై విరుచుకుపడుతుంటే... మన సైన్యం కూడా అదే స్థాయిలో బుద్ధి చెప్పాలన్నారు రౌత్. మన జవాన్లు నేరుగా పాక్‌ను ఎందుకు టార్గెట్ చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. అలా చేసినప్పుడు దాయాది దేశానికి సరైన గుణపాఠమన్నారు. బోర్డర్‌లోని షాపూర్, గలీ సెక్టార్‌లో పాక్ సైనికులు విరుచుకుపడ్డారు. ఆర్మీపై జరిపిన కాల్పుల్లో ఓ ఆర్మీ లెఫ్టినెంట్‌తో పాటు మరో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఈ దాడిని ప్రస్తావిస్తూనే సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.