యాప్నగరం

ప్రణబ్‌కి ఘనంగా వీడ్కోలు పలికిన పార్లమెంట్

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీ కాలం రేపటితో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రణబ్‌కి వీడ్కోలు..

TNN 23 Jul 2017, 6:57 pm
రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీ కాలం రేపటితో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రణబ్‌కి వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. పార్లమెంట్ సెంట్రల్ హాలు ఈ వీడ్కోలు కార్యక్రమానికి వేదికైంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్రమంత్రులు, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్, ఎన్డీఏ తరుపున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన వెంకయ్యనాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతోపాటు లోక్ సభ, రాజ్యసభ సభ్యులు అందరూ హాజరైన ఈ కార్యక్రమంలో ప్రణబ్ తన వీడ్కోలు ప్రసంగం చదివివినిపించారు.
Samayam Telugu mps giving farewell to president pranab mukherjee
ప్రణబ్‌కి ఘనంగా వీడ్కోలు పలికిన పార్లమెంట్


ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానం మొదలైన తీరు మొదలుకుని నేటివరకు తనకి ఎదురైన అనుభవాలని ప్రణబ్ పార్లమెంట్ సభ్యులతో పంచుకున్నారు. ప్రజాసేవలో తనకి సహకరించిన నేతలు, ప్రజలకి కృతజ్ఞతలు తెలిపారు ప్రణబ్. తాను మొత్తం ఐదుసార్లు లోక్ సభకి ఎన్నికవగా అందులో నాలుగుసార్లు వెస్ట్ బెంగాల్ నుంచి కాగా ఒకసారి గుజరాత్ నుంచి ఎన్నికయ్యాయని ప్రణబ్ గుర్తు చేసుకున్నారు. మరో రెండుసార్లు లోక్ సభకి ఎన్నికయ్యానని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధులు, మేధావుల మధ్య తొలిసారి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన సందర్భాన్ని తన వీడ్కోలు ప్రసంగంలో ప్రస్తావించారు.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీనే తనకి మార్గదర్శకురాలు అని స్పష్టంచేసిన ప్రణబ్.. ఎమర్జెన్సీ కాలంలో ఎదురైన అనుభవాలు, అధిగమించిన పరిస్థితులని సైతం ఈ ప్రసంగంతో నెమరు వేసుకున్నారు. రేపటితో రాష్ట్రపతిగా ప్రణబ్ పదవీ కాలం ముగియనుండగా కొత్త రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్ ఎల్లుండి ప్రమాణస్వీకారం చేయనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.