యాప్నగరం

మహారాష్ట్రలో టెన్షన్.. థాకరే పిలుపుతో విధ్వంసం

మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే మోదీ ముక్త్ భారత్ అంటూ నినాదం చేశారు. ఈ నినాదం మహారాష్ట్రలో పెద్ద దుమారాన్నే రేపుతోంది. అధినేత అలా చెప్పాడో లేదో... కార్యకర్తలు ఇలా రెచ్చిపోయారు.

Samayam Telugu 19 Mar 2018, 12:16 pm
మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే మోదీ ముక్త్ భారత్ అంటూ నినాదం చేశారు. ఈ నినాదం మహారాష్ట్రలో పెద్ద దుమారాన్నే రేపుతోంది. అధినేత అలా చెప్పాడో లేదో... కార్యకర్తలు ఇలా రెచ్చిపోయారు. గుజరాత్ అనే పదం కనిపిస్తే చాలు... ఇష్టం వచ్చినట్లు విరుచుకుపడ్డారు. నిన్న అధినేత అలా చెప్పారో లేదో... తెల్లవారే కార్యకర్తలంతా రోడ్లపైకి వచ్చారు. ముంబై శివారు ప్రాంతమైన వసాయ్‌లో గుజరాతీల షాపుల్ని టార్గెట్ చేశారు. వారి సైన్ బోర్డుల్ని ధ్వంసం చేశారు. అంతటితో ఆగలేదు... ముంబై-అహ్మదాబాద్ హైవేపై గుజరాతీ దాబాలపై కూడా విరుచుకుపడ్డారు.
Samayam Telugu msn workers pull down gujarati sign boards in maharashtra
మహారాష్ట్రలో టెన్షన్.. థాకరే పిలుపుతో విధ్వంసం


మహారాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోందట. గుజరాతీల ఆస్తుల్ని లక్ష్యంగా చేసుకొని ఎంఎన్‌ఎస్ కార్యకర్తలు చెలరేగుతున్నారు. పోలీసుల్ని కూడా భారీగా మోహరించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించినట్లు తెలుస్తోంది. గతేడాది కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇలాగే గుజరాతీల షాపులపై దాడులు జరిగాయి. తర్వాత సైన్ బోర్డుల్ని తొలగించడంతో పరిస్థితి సద్ధుమణిగింది. మళ్లీ ఇప్పుడు గొడవలు మొదలు కావడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.