యాప్నగరం

అంబానీ శాలరీ.. ఉద్యోగుల కన్నా తక్కువే!

భారతదేశంలోనే అత్యంత ధనికుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ జీతభత్యాల గురించి

Samayam Telugu 9 Jun 2018, 7:43 am
భారతదేశంలోనే అత్యంత ధనికుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ జీతభత్యాల గురించి ఒక వెబ్‌సైట్ ఆసక్తిదాయకమైన వివరాలను ప్రచురించింది. ముఖేష్ అంబానీ జీతం గురించి పేర్కొన్న ఆ మీడియా సంస్థ.. ఆయన తన డిప్యూటీల కన్నా తక్కువ జీతాన్ని తీసుకుంటున్నారని పేర్కొంది. తన కంపెనీలో పని చేసే వాళ్ల కన్నా యజమానిగా ముఖేష్ తక్కువ జీతం తీసుకొంటూ ఉండటమే ఇక్కడ పెద్ద విశేషం.
Samayam Telugu ambani.


ఆ వెబ్‌సైట్ ఇస్తున్న సమాచారం మేరకు.. ముఖేష్ అంబానీ ఏడాదికి 15కోట్ల రూపాయల వేతనాన్ని పొందుతూ ఉన్నారు. గత పది సంవత్సరాలుగా ముఖేష్ ఇదే శాలరీనే పొందుతున్నారు. ఇందులో హెచ్చుతగ్గులు లేవు.

అదే అంబానీ డిప్యూటీలు ఇద్దరు ఆయన కన్నా ఎక్కువ జీతం తీసుకొంటూ ఉండటం విశేషం. నిఖిల్, హితల్ మెస్వానీ అనే ఇద్దరు రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఏడాదికి 19.99 కోట్ల రూపాయల వేతనాన్ని పొందుతున్నట్టుగా తెలుస్తోంది. వీరు కేవలం రిలయన్స్‌లో ఉద్యోగులు మాత్రమే కాదు, ముఖేష్ అంబానీకి కజిన్స్ కూడా. వీరు వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ముఖేష్ అంబానీ కన్నా దాదాపు 4.99 కోట్ల రూపాయల వేతనాన్ని అధికంగా పొందుతూ ఉన్నారు. తన కింద పని చేసే వాళ్ల కన్నా తక్కువ జీతం తీసుకోవడానికి ముఖేష్ వెనుకాడే తత్వాన్ని కనబరచకపోవడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.