యాప్నగరం

బిడ్డా, కనీసం ఈ ఒక్క మాటైనా విను జర!

కొడుకుతో పంతానికిపోయి...తెగేదాకా లాగిన ఎస్పీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ సైకిల్ గుర్తు జార విడుచుకున్నాక

Samayam Telugu 18 Jan 2017, 9:12 am
కొడుకుతో పంతానికిపోయి...తెగేదాకా లాగిన ఎస్పీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ సైకిల్ గుర్తు జార విడుచుకున్నాక మెత్తబడ్డారు. చేసేది లేక కొడుకుతో సయోధ్యకు దిగారు.
Samayam Telugu mulaym bows to son akhilesh handsover wish list
బిడ్డా, కనీసం ఈ ఒక్క మాటైనా విను జర!


ఎన్నికల సంఘం సైకిల్ గుర్తును అఖిలేష్ కు కేటాయించాక..ఆయన తండ్రి ములాయంను కలిశారు. ఈ సందర్భంగా 38 మంది ఆశావాహుల పేర్లతో కూడిన జాబితాను ములాయం అఖిలేష్ కు అందించారు. ఏళ్ల తరబడి వాళ్లు తననే నమ్ముకున్నారని, కనీసం వారికి సీట్లు కేటాయించాలని ములాయం అఖిలేష్ ను రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం.

అయితే ఈ లిస్టులో తమ్ముడు శివపాల్ యాదవ్ పేరు ఉందా లేదా అన్నతి తెలియరాలేదు. ఒక వేళ ఉంటే ఆయనకు అఖిలేష్ టిక్కెట్ కేటాయిస్తారా అన్నది ఆసక్తిగా మారింది.

శివపాల్ తన కొడుకు ఆదిత్యతో పాటు ములాయం రెండో భార్య సాధన కోడలు అపర్ణలతో కూడి ఈసారి పోటీ చేయించాలని భావించారు. ఈ సమయంలోనే ఎస్పీలో చీలిక రావడం, మెజార్టీ నేతలు, సైకిలు గుర్తు అఖిలేష్ కు దక్కడంతో ఈసారి ఎవరెవరికీ సీట్లు దక్కుతాయో తెలియని పరిస్థితి.

అయితే ఎస్పీ అధ్యక్షుడిగా తన వర్గం నేతలతో ఎన్నికచేయించుకున్నప్పటి నుంచి అఖిలేష్ తండ్రి ములాయంను ఒక్కమాట కూడా అనలేదు. ఒకవైపు సైకిల్ గుర్తు కోసం పోరాటం చేస్తూనే తండ్రిని కలుస్తూ వచ్చారు. ఎస్పీకి ములాయమే మార్గదర్శి అని కూడా ప్రకటిస్తూ వచ్చారు.

ఈ నేపథ్యంలో తండ్రి సూచించిన 38 మంది అభ్యర్థుల్లో చాలామాందికి అవకాశం ఇచ్చి తండ్రి మాట వినే కొడుకుగా అనిపించుకోవాలని అఖిలేష్ భావిస్తున్నారు.

కాగా, ఎస్పీలో తలెత్తిన వివాదమంతా తండ్రీకొడుకులు ఆడిన డ్రామాగా రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.