యాప్నగరం

7 కార్లు ఢీ.. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, రహదారి రక్తసిక్తం

Tamil Nadu రాష్ట్రంలోని పుదుక్కొట్టైలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకేసారి ఏడుకార్లు ఢీకొన్నాయి. ప్రమాద సమయంలో వాహనాలు 100 kmph కంటే పైగా వేగంతో ఉన్నాయి..

Samayam Telugu 8 Aug 2019, 12:33 am
మిళనాడులోని పుదుక్కొట్టై - తిరుచ్చి రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకదాని వెంట ఒకటిగా వస్తున్న ఏడు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Samayam Telugu pic1-ConvertImage
తమిళనాడు రోడ్డు ప్రమాదం


పుదుక్కొట్టై - తిరుచ్చి మధ్య నార్తామలై రైల్వే పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా బుధవారం (ఆగస్టు 7) సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద విషయం గుర్తించగానే కొంత మంది స్థానికులు, వాహనదారులు సహాయ చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం అందించారు.

Read Also: వరంగల్ నిట్‌ను వెంటాడుతున్న ఆత్మహత్యలు.. క్యాంపస్‌కు ఏమైంది?

వీడియో: ప్రమాదం దృశ్యాలు..
తిరుచ్చి నుంచి వెళుతున్న ఓ కారు టైర్ ఒక్కసారిగా పంక్చరై పేలిపోవడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో ఆ కార్ల వెనకాల వస్తున్న మరో ఐదు వాహనాలు పరస్పరం ఢీకొని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనాలన్నీ 100 kmph కంటే పైగా వేగంతో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.

రోడ్డు ప్రమాదం


Read Also: మహిళా ఖైదీపై కానిస్టేబుల్ అత్యాచారం

రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, బాధితుల ఆర్తనాదాలతో ప్రమాదస్థలి భీతావహంగా మారింది. ప్రమాద తీవ్రతకు కార్లు నుజ్జు నుజ్జయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలికి వచ్చి సాయ కార్యక్రమాలు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.