యాప్నగరం

Mumbai Fire: భారీ భవంతిలో అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి

ముంబై మహా నగరంలో మరోసారి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చెంబూరు ప్రాంతంలో ఓ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

Samayam Telugu 27 Dec 2018, 11:52 pm
ముంబై: చెంబూరు ప్రాంతంలోని ఓ భారీ భవంతిలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. సర్గం కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని 10వ అంతస్తులో గురువారం రాత్రి మంటలు చెలరేగాయి. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే మంటల్లో చిక్కుకొని ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. వారిని కాపాడే ప్రయత్నంలో అగ్నిమాపక సిబ్బంది ఒకరు తీవ్ర గాయాల పాలయ్యారు.
Samayam Telugu fir


చనిపోయిన వారిలో నలుగురు సీనియర్ సిటిజన్లేనని సమాచారం. క్షతగాత్రులను రాజవాడి హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది 15 మందిని రక్షించగలిగారు.

ముంబై ఇటీవల వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. డిసెంబర్ 11న కమగర్ హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో వారం వయసున్న పసికందు సహా 11 మంది చనిపోయారు. 325 పడకల ఈ ఆసుపత్రికి ముంబై అగ్నిమాపక శాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేయలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.